సౌరాష్ట్ర 419 ఆలౌట్‌ 

Saurashtra All Out For 419 Against Andhra Team - Sakshi

ప్రస్తుతం ఆంధ్ర 40/2 

సాక్షి, ఒంగోలు: తొలి రోజు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన ఆంధ్ర బౌలర్లు రెండో రోజు లయ తప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్‌ చిరాగ్‌ జానీ (121; 12 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో... ఇక్కడి సీఎస్‌ఆర్‌ శర్మ కాలేజి మైదానంలో జరుగుతోన్న రంజీ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 226/6తో శుక్రవారం ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర చివరి 4 వికెట్లకు మరో 193 పరుగులు జోడించింది. ప్రేరక్‌ మన్కడ్‌ (80; 8 ఫోర్లు) రాణించాడు. యెర్రా పృథ్వీరాజ్, కేవీ శశికాంత్‌ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం జ్ఞానేశ్వర్‌ (22 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఆంధ్ర మరో 379 పరుగులు వెనుకబడి ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top