ముంబై:గత రెండు రోజుల క్రితం తొలి వన్డే మ్యాచ్ను పూర్తి చేసుకుని రెండో మ్యాచ్కు సిద్ధమవుతున్న భారత్-ఇంగ్లండ్ జట్లు ఇప్పుడు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒక మ్యాచ్ ముగిసిన తరువాత తదుపరి మ్యాచ్లు వెళ్లడానికి జాతీయ జట్లుకు సాధారణంగా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు. అయితే గురువారం కటక్లో జరిగే రెండో వన్డేకు ముందు ఇరు జట్లకు రూమ్ తిప్పులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కటక్లో హోటల్ రూమ్స్ లేకపోవడంతో భారత్-ఇంగ్లండ్ జట్లు అక్కడకు ఇంకా చేరలేదు. వివాహ కార్యక్రమాల్లో భాగంగా మొత్తం హోటల్ రూమ్స్ అన్ని బుక్ అయిన నేపథ్యంలో ఇరు క్రికెట్ జట్లు ఇంకా పుణెలోనే బస చేస్తున్నాయి. హోటల్ రూమ్స్ బుధవారం నాటికి మాత్రమే అందుబాటులో ఉండటంతో ఇరు జట్లు మంగళవారం సాయంత్రం వరకూ పుణెలో ఉండనున్నట్లు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అషిర్బాద్ బెహెరా తెలిపారు.
'తొలి వన్డే తరువాత కటక్లో జరిగే రెండో వన్డే విజయవంతమవుతుందని ఆశిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఎటువంటి సాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇప్పుడు జరిగింది. హోటల్ రూమ్స్ అందుబాటులో లేవు. హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంటేనే మేము వాటిని బుక్ చేసే అవకాశం ఉంది. మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు వరకూ హోటల్ రూమ్స్ లేవు.అందుచేత భారత్-ఇంగ్లండ్ జట్లు ఆలస్యంగా కటక్ చేరుకోనున్నాయి'అని బెహెరా పేర్కొన్నారు.
భారత్-ఇంగ్లండ్ జట్లకు రూమ్ తిప్పలు!
Published Tue, Jan 17 2017 3:04 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement