-
దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు!
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి టీమిండియా ఆతిథ్యం ఇస్తుంది. పుష్కర కాలం తర్వాత టీమిండియా గడ్డపై జరుగుతున్న టోర్నీ కావడంతో రోహిత్ సేనపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 2011లో వరల్డ్కప్ గెలిచిన ధోని సేన మ్యాజిక్ను రోహిత్ బృందం రిపీట్ చేస్తుందేమో చూడాలి. ఇక వరల్డ్కప్లో జరిగే మ్యాచ్ల సంగతి ఎలా ఉన్నా ఒక్క మ్యాచ్పై మాత్రం అందరి ఆసక్తి నెలకొంది. అదే ఇండియా, పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న(ఆదివారం) అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న లీగ్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ కావడంతో ఈసారి టీఆర్పీ రేటింగ్లు బద్దలవ్వడం ఖాయం. ఈ నేపథ్యంలో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ పురస్కరించుకొని అహ్మదాబాద్ ప్రాంతంలో అన్ని స్టార్ హోటల్స్కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మ్యాచ్ చూడడం కోసం వచ్చే అభిమానులతో హోటల్ గదులన్నీ నిండిపోనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం ఎన్నో నెలల ముందుగానే అహ్మదాబాద్ లో హోటల్ రూమ్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా అక్కడి హోటల్ యజమాను ఏకంగా రోజుకు రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నారు. కొన్ని స్టార్ హోటల్స్ లో ఇది ఏకంగా రూ.లక్ష వరకూ ఉంది. అయినా వాటిలోనూ బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. దీంతో అభిమానులు కొత్త ప్లాన్ వేశారు. నరేంద్ర మోదీ స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్ బెడ్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఒక రోజు వసతి కోసం అక్కడి హాస్పిటల్స్ ను కూడా ఫ్యాన్స్ వదలడం లేదు. ఇప్పటికే అలా తమకు ఎన్నో వినతులు వచ్చినట్లు స్టేడియం దగ్గర్లో ఉన్న హాస్పిటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. హెల్త్ చెకప్ కూడా.. ఈ హాస్పిటల్ బెడ్స్ కు కూడా ఆ ఒక్క రోజు వసతి కోసం రూ.3 వేల నుంచి రూ.25 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు. అందులోనే ఆహారంతోపాటు పూర్తి మెడికల్ చెకప్ లాంటి వసతులు కూడా ఇస్తున్నారు. దీంతో హోటల్ గదుల్లో వేలకువేలు పోసి రూమ్ తీసుకోవడం కంటే ఇలా చేయడం బెటరని చాలా మంది భావిస్తున్నారు. పేషెంట్ తోపాటు మరొకరు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తమ హెల్త్ చెకప్ పూర్తి కావడంతోపాటు ఒక రోజు వసతి కూడా కలుగుతుందన్నది చాలా మంది భావనగా కనిపిస్తోందని అక్కడి హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ నిఖిల్ లాలా చెప్పారు. ఆ అక్టోబర్ 15 సమయంలోనే తమకు 24 గంటల నుంచి 48 గంటల వసతి కోసం ఎన్నో వినతలు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లండ్, కివీస్ మ్యాచ్తో మహాసంగ్రామం మొదలు.. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరంలో మొత్తంగా 48 మ్యాచ్లు జరగనున్నాయి. కాగా లీగ్ మ్యాచ్లు పది వేదికల్లో జరగనుండగా.. మొదటి సెమీ ఫైనల్కు ముంబై, రెండో సెమీఫైనల్కు కోల్కతా.. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఇక అక్టోబర్ 5న డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో మెగా సమరానికి తెర లేవనుంది. చదవండి: Ind Vs WI 2nd Test: ధోనిని అధిగమించిన రోహిత్.. సిక్సర్ల విషయంలోనూ రికార్డే -
గోడలకు కళ్లుంటాయి.. గోప్యంగా చూస్తుంటాయి! జర జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: గోడలకు చెవులుంటాయ న్నది పాత సామెత. కానీ గోడ లకు కళ్లు కూడా ఉంటాయన్న చందంగా నేటి పరిస్థితులు మారుతున్నా యి. తమిళనాడు తిరు కొవి లూర్ లోని ఓ టెక్స్ టైల్ దుకాణంలో ఇటీ వల ట్రయల్ రూంలో దాచిన సెల్ఫోన్ ద్వారా యువతులు దుస్తులు మార్చు కొనే వీడి యోలను కొందరు గలీజుగాళ్లు రికార్డు చేయడం తెలిసిందే. ఇలా ఎక్కడో ఒక చోట ఈ తరహా ఘటనలు బయట పడుతూనే ఉన్నా యి. ఈ నేపథ్యంలో ట్రయల్ రూంలకు వెళ్లిన ప్పుడు లేదా హోటళ్లలో బస చేసిన ప్పుడు మహిళలు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని పోలీ సులు సూచిస్తున్నారు. ►నచ్చిన దుస్తులు సరిపోయాయో లేదో తెలుసుకోవాలంటే వినియోగదారులు ట్రయల్ రూంలకు వెళ్లక తప్పదు. అదేవిధంగా విహారయాత్రలు, ఆఫీస్ పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటళ్లలో బస చేయడమూ అనివార్యమే. అక్కడ వాష్రూంలను వాడకుండా ఉండలేం. ఇదే అవకాశంగా చేసుకొని కొందరు సిబ్బంది రహస్య కెమెరాలు పెట్టి మహిళల వీడియోలను తీసే దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. హోటళ్లు, దుకాణ యజమానులకు తెలియకుండానే కొందరు సిబ్బంది ఇలాంటి అనైతిక పనులకు పాల్పడుతుండటం యాజమాన్యాలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇలా చేస్తే ముప్పు తప్పుతుంది.. ► వస్త్రాల కొనుగోలు కోసం మాల్స్కు వెళ్లిన ప్పుడు ట్రయల్ రూంకు వెళ్లాల్సి వచ్చినా లేదా హోటళ్లలో వాష్రూంలు వాడాల్సి వచ్చినా అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి. ఏమాత్రం అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే బయటకు వచ్చేయాలి. ► సెల్ఫోన్ టార్చ్ వేస్తూ చూస్తే రహస్య కెమెరాలు ఉండి ఉంటే వాటి లెన్స్పై టార్చ్పడి రిప్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కూడా రహస్య కెమెరాల ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ► హోటల్ గదుల్లో బస చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా రాత్రివేళ్లలో నిద్రించాలంటే ముందుగా సీలింగ్ ఫ్యాన్ ఉన్న గదుల్లో లైట్లు ఆర్పి సెల్ఫోన్ టార్చ్ వేసి చూడాలి. రెడ్లైట్ బ్లింక్ అవుతున్నట్లు గమనిస్తే దాన్ని హిడెన్ కెమెరాగా అనుమానించాలి. ► ట్రయల్ రూంలు, హోటల్ రూంలకు ఉన్న తలుపులకు ఏవైనా అనుమానాస్పద రంద్రాలు ఉన్నట్లు గుర్తించినా.. అందులో ఏవైనా వస్తువులు ఉన్నట్లు గమనించినా వెంటనే యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. ► ట్రయల్ రూంలు, వాష్ రూంలలో దుస్తులు తగిలించేందుకు ఉండే కర్టెన్ రాడ్స్ లేదా కొక్కాలకు కెమెరాలు పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటివి ఉన్నాయో లేదో చూడాలి. ► ట్రయల్ రూంలలో, వాష్రూంలలో ఉండే అద్దాల వెనుక సైతం మనకు తెలియకుండా కెమెరా పెట్టి రికార్డ్ చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మిర్రర్ ట్రిక్ వాడాలి. మీ వేలిని అద్దానికి తాకేలా పెడితే దాని ప్రతిబింబానికి మీ వేలికి దూరం ఉంటే అది నిజమైనది. ఆ వేలు ప్రతిబింబానికి ఆనితే అది రెండోవైపు నుంచి మనం కనిపించే అవకాశం ఉన్నట్లు అనుమానించాలి. -
చిన్న పట్టణాల్లో ఎక్కువ బుకింగ్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది చిన్న పట్టణాల్లో హోటల్ గదుల బుకింగ్లు ఎక్కువగా ఉన్నట్టు ఓయో తెలిపింది. హోటల్ బుకింగ్ సేవలను అందించే ఈ సంస్థ ఈ ఏడాదికి సంబంధించి గణాంకాలు విడుదల చేసింది. తెనాలి, హాత్రాస్, ససారామ్, కరైకుడి తదితర పట్టణాల్లో క్రితం ఏడాదితో పోల్చినప్పుడు ఈ ఏడాది ఎక్కువ బుకింగ్లు చూసినట్టు తెలిపింది. వ్యాపార పర్యటనలకు సంబంధించి బుకింగ్ల్లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, చెన్నై అగ్రస్థానాల్లో ఉన్నాయి. జూన్ 4న అత్యధిక బుకింగ్లు ఓయో ప్లాట్ఫామ్ ద్వారా నమోదయ్యాయి. భక్తులు ఎక్కువగా బుకింగ్ చేసుకున్న కేంద్రంగా వారణాసి నిలిచింది. తిరుపతి, పూరి, అమృత్సర్, హరిద్వార్ బుకింగ్ల పరంగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే యూరప్లో లగ్జెంబర్గ్ ప్రావిన్స్ ఎక్కువ మంది పర్యాటకులకు ఇష్టమైన కేంద్రంగా నిలిచింది. ఓయో ప్లాట్ఫామ్పై ఎక్కువ మంది ఇక్కడకు బుక్ చేసుకున్నారు. అమెరికాలో టెక్సాస్ను ఎక్కువ మంది సందర్శించారు. బ్రిటన్కు సంబంధించి లండన్, ప్లైమౌత్, మిడిల్స్బ్రో, లీచెస్టర్, బ్రైటాన్ పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశాలుగా ఉన్నాయి. చదవండి: జియో..షావోమీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త! -
వరద బీభత్సం.. ఒక రాత్రికి రూ.40వేలు పలుకుతున్న హోటల్స్!
వరదల కారణంగా ఐటీ నగరం బెంగళూరు అస్తవ్యస్తంగా మారింది. పలు చోట్ల ఇళ్లలోకి వరదనీరు రావడంతో అక్కడి ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు తాత్కాలికంగా వారి ఇళ్లను విడిచిపెట్టి హోటల్లో బస చేస్తున్నారు. దీంతో నగరంలో హోటళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఇదే అవకాశం అన్నట్లు హోటల్ యాజమాన్యాలు ఒక్క రాత్రి ఏకంగా రూ.20 వేల నుంచి రూ.40వేలు వసూలు చేస్తున్నారట. ఒక్క రాత్రికి రూ. 30వేలు అయినా దొరకట్లే.. పర్పుల్ఫ్రంట్ టెక్నాలజీస్ సీఈఓ, వ్యవస్థాపకురాలు మీనా గిరీసబల్ల చెప్పినట్లు ఓ వార్త పత్రికకు తెలిపిన సమాచారం ప్రకారం.. ‘యెమలూరులోని మా విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ వరదల్లో చిక్కుకుంది. ఆ తర్వాత మేము ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లోని హోటల్లో మా కుటుంబసభ్యులతో ఒక రోజు బస చేసేందుకు రూ. 42,000 ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. ఓ పక్క హోటల్ రూమ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ కొందరికీ ఆ గదులు కూడా దొరకట్లేదట. ఎందుకంటే చాలా నగరంలోని హోటళ్లు రాబోయే వారం రోజులకు పూర్తిగా బుక్ చేసుకున్నట్లు సమాచారం. హోటల్ యజమానుల ప్రకారం.. వరద ప్రభావం అధికంగా ఉండడంతో చాలా మంది ముందుగానే గదులను బుక్ చేసుకున్నారు. వరద నీరు తగ్గినప్పటికీ కూడా వారి ఇళ్లను శుభ్రం చేసుకోవడంతో పరిసరాల్లోని వ్యర్థాలను తొలగించేందుకు చాలా సమయం పడుతుందని.. దీంతో హోటల్లో రమ్లు దొరకట్లేదని అంటున్నారు. ఇంకా ఐదు రోజులు ఇంతే.. మరో వైపు నగరవాసులకు మరింత ఆందోళన కలిగిస్తూ వాతావరణ శాఖ (IMD) బెంగళూరులో రాబోయే ఐదు రోజుల పాటు నిరంతర వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏజెన్సీ బుధవారం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. వర్షాభావ ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే వారు ఇతర ప్రాంతాలకు మారాల్సి వస్తోంది. మొదటి అంతస్తు, పై అంతస్తులో నివసించే ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ట్రాక్టర్లు, పడవలపై రాకపోకలు సాగించాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం, భారీ వర్షం కారణంగా బెంగళూరులోని 85 ప్రాంతాలు 2,000 ఇళ్లు జలమయమయ్యాయి. చదవండి: ఉద్యోగులకు అలర్ట్.. టాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే ఈ బిల్లులు ఉండాల్సిందే! -
భారత్-ఇంగ్లండ్ జట్లకు రూమ్ తిప్పలు!
ముంబై:గత రెండు రోజుల క్రితం తొలి వన్డే మ్యాచ్ను పూర్తి చేసుకుని రెండో మ్యాచ్కు సిద్ధమవుతున్న భారత్-ఇంగ్లండ్ జట్లు ఇప్పుడు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒక మ్యాచ్ ముగిసిన తరువాత తదుపరి మ్యాచ్లు వెళ్లడానికి జాతీయ జట్లుకు సాధారణంగా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు. అయితే గురువారం కటక్లో జరిగే రెండో వన్డేకు ముందు ఇరు జట్లకు రూమ్ తిప్పులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కటక్లో హోటల్ రూమ్స్ లేకపోవడంతో భారత్-ఇంగ్లండ్ జట్లు అక్కడకు ఇంకా చేరలేదు. వివాహ కార్యక్రమాల్లో భాగంగా మొత్తం హోటల్ రూమ్స్ అన్ని బుక్ అయిన నేపథ్యంలో ఇరు క్రికెట్ జట్లు ఇంకా పుణెలోనే బస చేస్తున్నాయి. హోటల్ రూమ్స్ బుధవారం నాటికి మాత్రమే అందుబాటులో ఉండటంతో ఇరు జట్లు మంగళవారం సాయంత్రం వరకూ పుణెలో ఉండనున్నట్లు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అషిర్బాద్ బెహెరా తెలిపారు. 'తొలి వన్డే తరువాత కటక్లో జరిగే రెండో వన్డే విజయవంతమవుతుందని ఆశిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఎటువంటి సాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇప్పుడు జరిగింది. హోటల్ రూమ్స్ అందుబాటులో లేవు. హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంటేనే మేము వాటిని బుక్ చేసే అవకాశం ఉంది. మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు వరకూ హోటల్ రూమ్స్ లేవు.అందుచేత భారత్-ఇంగ్లండ్ జట్లు ఆలస్యంగా కటక్ చేరుకోనున్నాయి'అని బెహెరా పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement