విజయం దిశగా టీంఇండియా | Sakshi
Sakshi News home page

విజయం దిశగా టీంఇండియా

Published Mon, Jul 21 2014 7:00 PM

విజయం దిశగా టీంఇండియా

లండన్: ఇంగ్లండ్ తో జట్ల మధ్య ఇక్కడ లార్డ్స్ లో జరుగుతున్నరెండో టెస్ట్ లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై తొలుత ఉత్కంఠ నెలకొన్నాటీం ఇండియా బౌలర్లు విజృంభించి వరుస వికెట్లు నేలకూల్చారు. చివరి రోజు భోజన విరామ సమయానికి కుక్ సేన 5 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లిష్ ఆటగాళ్లు నాలుగు వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం భారత్ విజయానికి ఇంకా వికెట్ మాత్రమే తీయాల్సి ఉంది.



రూట్ అర్థసెంచరీ (66) పరుగులతో ఆకట్టుకున్నా 9 వికెట్టుగా వెనుదిరిగాడు.  ఇంగ్లండ్216/9 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. విజయం సాధించాలంటే 103 పరుగులు చేయాలి.

Advertisement
Advertisement