మరో విజయమే లక్ష్యంగా...

India is fighting against Zimbabwe in Under-19 World Cup today - Sakshi

అండర్‌–19 ప్రపంచకప్‌లో నేడు జింబాబ్వేతో భారత్‌ పోరు  

మౌంట్‌ మాంగనీ: వరుస విజయాలతో అండర్‌–19 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన భారత యువ జట్టు శుక్రవారం తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన పృథ్వీ షా బృందం రెండో మ్యాచ్‌లో పసికూన పపువా న్యూ గినియాపై ఘన విజయం సాధించి మంచి ఊపుమీద ఉంది.

ఇదే వరుసలో జింబాబ్వేపై గెలుపొంది అజేయంగా నాకౌట్‌కు వెళ్లాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్‌ ‘బి’ నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండు విజయాలతో క్వార్టర్స్‌కు చేరుకున్నాయి.    ఉదయం 6.30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top