హైదరాబాద్ బౌలర్లు విఫలం | hyderabad bowlers failed in first innigs against tsca | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ బౌలర్లు విఫలం

Aug 6 2016 11:24 AM | Updated on Sep 19 2018 6:31 PM

ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీ తొలిరోజు ఆటలో హైదరాబాద్ ఎలెవన్ బౌలర్లు విఫలమవడంతో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎస్‌సీఏ) భారీ స్కోరును చేసింది.

హైదరాబాద్: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీ తొలిరోజు ఆటలో హైదరాబాద్ ఎలెవన్ బౌలర్లు విఫలమవడంతో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎస్‌సీఏ) భారీ స్కోరును చేసింది.

 

శుక్రవారం తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీఎన్‌సీఏ ఎలెవన్ 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. భరత్ శంకర్ (119), ముకుంద్ (136) సెంచరీలతో కదం తొక్కగా... శ్రీధర్ రాజు (90), రాహుల్ (56 నాటౌట్) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ ఎలెవన్ బౌలర్లలో కిరణ్, మెహదీ హసన్, ఆకాశ్ బండారి తలో వికెట్ తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement