గుంటూరులో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు

TDP Workers Attacks YSRCP Activists In Ponnur - Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పొన్నూరు మండలం కొండముదిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. ఈ ఘటనలో నలుగురు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య విజయోత్సవ ర్యాలీకి ఆటంకం కల్పించేందుకు టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం దాడులకు తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top