కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న రేవంత్‌ రెడ్డి | Revanth Reddy Reached Delhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌ రెడ్డి బృందం

Oct 31 2017 12:25 PM | Updated on Aug 11 2018 4:44 PM

Revanth Reddy Reached Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ తెలుగుదేశం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలోని తన నివాసంలో కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. రేవంత్‌కు మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్‌తోపాటు మరికొందరు నేతలకు కూడా రాహుల్‌ కండువాలు కప్పారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌ సీ కుంతియా, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు.

రేవంత్ రెడ్డితో పాటు సీతక్క, వేంనరేందర్ రెడ్డి(వరంగల్‌), సిహెచ్‌. విజయ రమణరావు(పెద్దపల్లి), అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్, సోయం బాబురావు(బోథ్‌), పటేల్ రమేష్ రెడ్డి, దొమ్మటి సాంబయ్య, తోటకూర జానయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హరిప్రియ నాయక్, బల్య నాయక్, రాజారాం యాదవ్, ముగ్గురు ఓయూ జాక్ సభ్యులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఢిల్లీలో తన మద్దతుదారులతో రేవంత్ రెడ్డి


కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తెలంగాణ టీడీపీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement