పవన్‌పై రాంగోపాల్‌ వర్మ సెటైర్‌

Ram Gopal Varma Satirical Punch to Pawan Kalyan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ‍్యలపై ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో తనను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారన్న పవన్‌ వ్యాఖ‍్యలు ఓటర్లను అవమానించడమే అని వర్మ ట్వీట్‌ చేశారు. పవన్‌ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే అని, ఆయనను నిజంగా గెలిపించాలనుకునే ఓటర్లు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పవన్‌కే ఓటు వేసేవారంటూ వర్మ సెటైర్ వేశారు. కాగా తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయకుండా ప్రత్యర్థులు కుట్ర పన్నారంటూ పవన్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

చదవండి: (నన్ను అసెంబ్లీకి అడుగుపెట్టనీకుండా కుట్ర...)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top