‘బాబు కరోనా కంటే ప్రమాదం’

Koyya Prasad Reddy Slams On Chandrababu In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు, టీటీపీ నాయకులు కరోనా వైరస్‌ కంటే ప్రమాదరంగా తయారయ్యారని ఏపీ టెక్నాలజీస్‌ మాజీ చైర్మన్‌ కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై ప్రపంచ మొత్తం ఆందోళన చెందుతుంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల క్యాలెండర్‌ను విడుదల చేయటం అభినందనీయమని ఆయన కొనియాడారు. పోతిరెడ్డిపాడుపై స్పందించని చం‍ద్రబాబు మద్యం సేవించిన డాక్టర్‌ సుధాకర్‌పై మాట్లాడతారని ఆయన ఎద్దేవా చేశారు. కొత్త మెడికల్‌ కాలేజీలు, పోర్ట్‌ జట్టీలతో లాక్‌డౌన్‌ అనంతరం రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీయడం ఖాయమని ప్రసాద్‌రెడ్డి తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top