సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను తయారు చేయాలని సీపీఎం చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే గండిపడింది. గత మూడేళ్లుగా వివిధ ఆందోళన కార్యక్రమాల్లో భుజం, భుజం కలిపి పాల్గొన్న ఇతర వామపక్ష పార్టీలను కలుపుకొని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని సీపీఎం భావిస్తోంది. దీనికోసం వివిధ కుల సంఘాలు, సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలతో పాటు వామపక్షాలు, కొన్ని ఇతర పార్టీలతోనూ చర్చించి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)కు రూపకల్పన చేసింది. ఎంసీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ, బీఎస్పీ, ఎంబీటీ, లోక్సత్తా తదితర 28 పార్టీలు బీఎల్ఎఫ్లో చేరాయి. అయితే మరో ప్రధాన వామపక్ష పార్టీ సీపీఐ ఈ వేదికకు దూరంగా ఉంటామని, తామే లౌకిక, ప్రజాతంత్ర వామపక్ష కూటమిని తయారు చేస్తున్నామని ప్రకటించింది. దీనికి తోడు సీపీఐ ఎం–ఎల్ (న్యూ డెమొక్రసీ) సైతం బీఎల్ఎఫ్లో చేరే విషయాన్ని ఇంకా స్పష్టం చేయకపోవడంతో ఆ పార్టీ కూడా ప్రస్తుతానికి దూరంగా ఉన్నట్టేనని భావిస్తున్నారు.
వాస్తవానికి ఈ నెల 25వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఎల్ఎఫ్ను ప్రారంభించాలని నిర్ణయించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాశ్ అంబేడ్కర్ ఈ సభకు హాజరవుతున్నారని గురువారం ప్రకటించారు. కాగా, ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే సీపీఐ రాత్రికి రాత్రి తాము కూడా ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో బహుజన వామపక్ష కూటమికి ఆదిలోనే హంసపాదు పడినట్లు తెలుస్తోంది.
ముందు నుంచీ అంతే: ముందు నుంచీ సీపీఎం, సీపీఐ మధ్య పొసగడం లేదని, ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు ఆమోదించే పరిస్థితులు లేవని, ఈ తరుణంలో వామపక్షాల ఐక్యత సాధ్యం కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో రెండు పార్టీలూ ఆయా ఎన్నికల్లో సమ ఉజ్జీలుగానే ఉన్నాయి. ఖమ్మం, మధిర, భద్రాచలం, మిర్యాలగూడెం, నల్లగొండ, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, ఇబ్రహీంపట్నం, తదితర నియోజకవర్గాలకు గతంలో సీపీఎం ప్రాతినిధ్యం వహించింది.
ప్రస్తుతం ఆ పార్టీ చేతిలో ఒక్క భద్రాచలం మాత్రమే మిగిలింది. కాగా, బెల్లంపల్లి, పరకాల, మహబూబాబాద్, మునుగోడు, దేవరకొండ, కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లో సీపీఐ ప్రాతినిధ్యం వహించింది. గత ఎన్నికల్లో దేవరకొండ నుంచి సీపీఐ గెలిచినా, ఆ పార్టీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ప్రస్తుతం ఒక్క సీటు కూడా ఆ పార్టీ చేతిలో లేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఈ రెండు పార్టీలూ ఉనికి కోసం పోరాడుతున్నాయి.
ప్రత్యామ్నాయ వేదికకు ఆదిలోనే గండి
Published Sat, Jan 13 2018 3:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement