పట్నాలో 3న కాంగ్రెస్‌ భారీ సభ

Congress gears up for February 3 rally in Patna - Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కోల్‌కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహించిన విపక్ష కూటమి సభ విజయవంతమైన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ పార్టీ ఇతర కలసి వచ్చే విపక్షాలతో కలిసి బిహార్‌లో ‘జన ఆకాంక్ష’ పేరుతో ఓ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 3న పట్నాలోని గాంధీ మైదాన్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఈ సభ జరగబోతోంది. ఇప్పటికే విపక్ష పార్టీల నేతలను కాంగ్రెస్‌ ఈ సభకు ఆహ్వానించింది. బిహార్లో ఇప్పటికే ఆర్జేడీ కాంగ్రెస్‌కు బలమైన మిత్రపక్షం. హిందుస్తాన్‌ ఆవామీ మోర్చాకూడా కాంగ్రెస్‌ మద్దతుదారే. ఈ నేపథ్యంలోనే పట్నాలో సభ నిర్వహణకు కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ను పక్కనపెట్టిన విషయం తెలిసిందే. మరో కీలక రాష్ట్రమైన బిహార్లోనూ కాంగ్రెస్‌ కోరుకున్నన్ని సీట్లు లాలూ ప్రసాద్‌ నేతృత్వంలోని ఆర్జేడీ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top