భారత్‌కు పాక్‌ వార్నింగ్‌ | We Know How to Deal With india: Pakistan | Sakshi
Sakshi News home page

భారత్‌కు పాక్‌ వార్నింగ్‌

Nov 24 2016 3:50 PM | Updated on Sep 4 2017 9:01 PM

భారత్‌కు పాక్‌ వార్నింగ్‌

భారత్‌కు పాక్‌ వార్నింగ్‌

పాకిస్థాన్‌ ఉగ్రవాదులు మాత్రమే కాదు.. అక్కడ బాధ్యతాయుతమైన అధికారాలు నిర్వహిస్తున్న పెద్ద వ్యక్తులు కూడా భారత్‌ను రెచ్చగొట్టే చర్యలు మానుకోవడం లేదు.

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఉగ్రవాదులు మాత్రమే కాదు.. అక్కడ బాధ్యతాయుతమైన అధికారాలు నిర్వహిస్తున్న పెద్ద వ్యక్తులు కూడా భారత్‌ను రెచ్చగొట్టే చర్యలు మానుకోవడం లేదు. జమ్మూకశ్మీర్‌ విషయంలో భారత్‌ ను ఎలా డీల్‌ చేయాలో తమకు బాగా తెలుసంటూ పాకిస్థాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ మార్షల్‌సోహెయిల్‌ అమన్‌ భారత్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు.

వాస్తవాదీన రేఖ వెంబడి రెండు దేశాల మధ్య హింసాత్మక సంఘటనలు పెరిగిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, అయిన తమకు ఎలాంటి ఆందోళన లేదని పేర్కొన్నారు. భారత​ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 12మంది పౌరులు ముగ్గురు తమ జవాన్లు చనిపోయినట్లు పాక్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో కరాచీలో అమన్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ఇలాంటి చర్యలు భారత్‌ నిలిపివేస్తే మంచిది. వివాదాన్ని మరింత పెద్దది చేయాలని చూస్తే పాక్‌ సైన్యం కూడా ఆ పని చేయగలదు. ఈ విషయంలో భారత్‌తో ఎలా ముందుకు వెళ్లాలో మాకు బాగా తెలుసు’ అంటూ ఆయన బీరాలు పోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement