యోగాతో ప్రపంచమంతా భారత్‌తో మమేకం: మోదీ | PM Modi and up cm participate in Worald Yoga Day | Sakshi
Sakshi News home page

యోగాతో ప్రపంచమంతా భారత్‌తో మమేకం: మోదీ

Jun 21 2017 8:09 AM | Updated on Aug 15 2018 2:32 PM

యోగాతో ప్రపంచమంతా భారత్‌తో మమేకం: మోదీ - Sakshi

యోగాతో ప్రపంచమంతా భారత్‌తో మమేకం: మోదీ

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. '

లక్నో: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. 'ఆరోగ్యం కోసం యోగా' పేరిట బుధవారం మూడో అంతర్జాతీయ యోగా డేను జరుపుకుంటున్నారు. ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశంలో ఐదు వేళ చోట్ల యోగా డే కార్యక్రమాలు చేపట్టారు. నేటి ఉదయం లక్నోలోని రామాబాయ్ సభాస్థల్‌లో నిర్వహించిన యోగా డే వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. యోగా నిపుణుల పర్యవేక్షణలో వారి సూచనల ప్రకారం వేలాది ఔత్సాహికులతో కలిసి మోదీ, యోగి పలు రకాల యోగాసనాలు వేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మీడియాతో మాట్లాడుతూ.. 'యోగాతో ప్రపంచమంతా భారత్‌తో మమేకమైంది. యోగాతో శారీరక, మానసిక వికాసం సాధ్యం. మూడేళ్లలో అనేక యోగా శిక్షణా సంస్థలు ఆవిర్భవించడం ఆనందదాయకం. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగం చేసుకోవాలని' దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. యోగాలో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయని, ప్రతిరోజు తప్పనిసరిగా యోగి చేయడం ద్వారా అందరూ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement