లారీ వదిలి ఉల్లి ఎత్తుకుపోయారు!

Onions worth Rs 22 lakh go missing, empty truck found - Sakshi

శివ్‌పురి: ఉల్లి లోడు లారీని ఎత్తుకుపోయిన దొంగలు.. రూ.22లక్షల విలువైన ఉల్లి గడ్డలను ఉంచుకుని లారీని వదిలేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో జరిగింది. ఈనెల 11వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు 40 టన్నుల ఉల్లి గడ్డలతో ఓ లారీ బయలుదేరింది. ఆ లారీ ఈ నెల 22వ తేదీన గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, అది కనిపించకుండా పోవడంతో ఉల్లి వ్యాపారి ప్రేమ్‌చంద్‌ మధ్యప్రదేశ్‌ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు టెండు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆ లారీ ఖాళీగా కనిపించింది. మధ్యప్రదేశ్‌లో కిలో ఉల్లి రూ.100 వరకు పలుకుతోంది.

సూరత్‌లో ఉల్లి దొంగలు
గుజరాత్‌: సూరత్‌లోని ఒక కూరగాయల దుకాణంలో రూ. 25 వేల విలువచేసే 250 కేజీల ఉల్లిని దొంగలు దోచేశారు. పాలన్పూర్‌ పటియాలోని దుకాణంలో ఈ చోరీ జరిగింది. ‘ఎప్పటిలాగే ఐదు 50 కేజీల బ్యాగులను బుధవారం రాత్రి అమ్మకానికి తీసుకొచ్చాం. గురువారం తెల్లవారుజామున దొంగలు ఐదు సంచీలను ఎత్తుకెళ్లారు’ అని దుకాణం ఉద్యోగి తెలిపారు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top