breaking news
lorry missing
-
లారీ వదిలి ఉల్లి ఎత్తుకుపోయారు!
శివ్పురి: ఉల్లి లోడు లారీని ఎత్తుకుపోయిన దొంగలు.. రూ.22లక్షల విలువైన ఉల్లి గడ్డలను ఉంచుకుని లారీని వదిలేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని శివ్పురి జిల్లాలో జరిగింది. ఈనెల 11వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు 40 టన్నుల ఉల్లి గడ్డలతో ఓ లారీ బయలుదేరింది. ఆ లారీ ఈ నెల 22వ తేదీన గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, అది కనిపించకుండా పోవడంతో ఉల్లి వ్యాపారి ప్రేమ్చంద్ మధ్యప్రదేశ్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు టెండు పోలీస్స్టేషన్ పరిధిలో ఆ లారీ ఖాళీగా కనిపించింది. మధ్యప్రదేశ్లో కిలో ఉల్లి రూ.100 వరకు పలుకుతోంది. సూరత్లో ఉల్లి దొంగలు గుజరాత్: సూరత్లోని ఒక కూరగాయల దుకాణంలో రూ. 25 వేల విలువచేసే 250 కేజీల ఉల్లిని దొంగలు దోచేశారు. పాలన్పూర్ పటియాలోని దుకాణంలో ఈ చోరీ జరిగింది. ‘ఎప్పటిలాగే ఐదు 50 కేజీల బ్యాగులను బుధవారం రాత్రి అమ్మకానికి తీసుకొచ్చాం. గురువారం తెల్లవారుజామున దొంగలు ఐదు సంచీలను ఎత్తుకెళ్లారు’ అని దుకాణం ఉద్యోగి తెలిపారు -
చెక్పోస్టు వద్ద లారీ అపహరణ
చెక్పోస్టు వద్ద లారీ అపహరణ బీవీపాళెం(తడ): ఒడిశా నుంచి చెన్నైకు ఐరన్ లోడుతో వెళ్లిన లారీ తిరిగి వెళ్లే క్రమంలో బీవీపాళెం చెక్పోస్టు వద్ద ఆగిన సమయంలో అపహరణకు గురైంది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. డ్రైవర్ రామ్మూర్తి, క్లీనర్ వెంకయ్య సమాచారం మేరకు.. ఒడిశా నుంచి లారీ(ఏపీ25 డబ్ల్యూ 5499)లో ఐరన్ రాడ్లు తీసుకుని శుక్రవారం చెన్నై వెళ్లారు. అక్కడ అన్లోడ్ చేసుకుని రాత్రి 12.10 ప్రాంతంలో బీవీపాళెం చెక్పోస్టు వద్దకు చేరుకున్నారు. నిద్ర మత్తుగా ఉండటంతో టీ తాగి, సెల్ఫోన్కు రీచార్జ్ చేసుకునేందుకు లారీని రోడ్డు పక్కన ఆపి కిందకు దిగారు. కానీ తాళాలు లారీలోనే ఉంచేయడంతో గమనించిన దుండగుడు లారీని తీసుకుని తడ వైపు వెళ్లారు. గమనించిన క్లీనర్ వెనుకనే వెంబడించగా లారీ తప్పించుకుంది. ఇంతలో పెట్రోలింగ్ తిరుగుతూ వచ్చిన తడ పోలీస్ వాహనాన్ని గుర్తించిన క్లీనర్ విషయం తెలపడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. తడకు చేరుకుని తడలో శ్రీకాళహస్తి మార్గంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా లారీ 12. 20 సమయంలో తడ సర్వీస్ రోడ్డు మీదుగా శ్రీకాళహస్తి వైపు వెళ్లినట్టు గుర్తించారు. ఎస్ఐ సురేష్బాబు లారీ సిబ్బందిని వెంట బెట్టుకుని వరదయ్యపాళెం, సత్యవేడు ప్రాంతాల్లో అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా అక్కడ లారీ ఎంటర్ కాలేదని గుర్తించారు. ఈ రెండు ప్రాంతాలకు రాకుండా లారీ పారిపోయేందుకు ఉన్న మార్గాల్లో గాలింపు చేపట్టారు. మరో మార్గంలో నాగలాపురం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందన్న అనుమానంతో ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు ఎటువంటి ఆచూకీ లభించలేదు. గతంలో చెక్పోస్టు పరిసరాల్లో లారీల అపహరణలు అధికంగా ఉన్నప్పటికీ కొంత కాలంగా తగ్గుముఖం పట్టాయి. కేవలం ఇన్నోవా కార్లు మాత్రమే అపహరించడం జరుగుతూ వస్తుంది. దొంగలు మళ్లీ లారీలపై దృష్టి సారించడంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు.