సభ సజావుగా జరిగేలా చూడండి:ప్రధాని | Manmohan Singh seeks cooperation of political parties for constructive monsoon session | Sakshi
Sakshi News home page

సభ సజావుగా జరిగేలా చూడండి:ప్రధాని

Aug 6 2013 1:32 AM | Updated on Sep 17 2018 5:36 PM

సభ సజావుగా జరిగేలా చూడండి:ప్రధాని - Sakshi

సభ సజావుగా జరిగేలా చూడండి:ప్రధాని

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాఫీగా జరిగేందుకు సహకరించాల్సిందిగా ప్రధాని మన్మోహన్‌సింగ్ సోమవారం విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాఫీగా జరిగేందుకు సహకరించాల్సిందిగా ప్రధాని మన్మోహన్‌సింగ్ సోమవారం విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. గత రెండు మూడు సమావేశాల్లో ఎంతో సమయం వృథా అయిందని, దాన్ని ఈసారి పునరావృతం కానీయొద్దని ఉదయం పార్లమెంటు ఆవరణలో విలేకరులతో ఆయనన్నారు. కానీ తర్వాత కాసేపటికే ఆయన సొంత పార్టీ ఎంపీలే ఉభయ సభలనూ పదేపదే స్తంభింపజేయడం విశేషం!

Advertisement
 
Advertisement
Advertisement