శ్రీలంక అదుపులో భారత జాలర్లు
కొలంబో: తమ ప్రాదేశిక జాలాల్లోకి ప్రవేశించారనే నెపంతో నలుగురు మత్య్సకారులను శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శ్రీలంక నేవి లెఫ్టినెంట్ కమాండర్ చమిందా మీడియాకు తెలిపారు.
సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నామని వారి వద్ద నుంచి బోటుతో పాటు పలు సామన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.