breaking news
Delft Island
-
శ్రీలంక అదుపులో భారత జాలర్లు
కొలంబో: తమ ప్రాదేశిక జాలాల్లోకి ప్రవేశించారనే నెపంతో నలుగురు మత్య్సకారులను శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శ్రీలంక నేవి లెఫ్టినెంట్ కమాండర్ చమిందా మీడియాకు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నామని వారి వద్ద నుంచి బోటుతో పాటు పలు సామన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. -
శ్రీలంక అదుపులో భారత జాలర్లు
రామేశ్వరం: తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో శ్రీలంక నేవి సిబ్బంది 13 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. మత్స్యకారులకు చెందిన రెండు బోట్లను సీజ్ చేయడంతో పాటు చేపల వేటకు వినియోగించే 20 వలలను ధ్వంసం చేశారు. రామేశ్వర తీరంలోని వాడమరచి వద్ద శ్రీలంక ప్రదేశిక జలాల్లో చేపలు పడుతున్న నలుగురు మత్స్యకారులతో పాటు, అక్కరాయిపెట్టాయి వద్ద తొమ్మిది మందిని అరెస్ట్ చేసి నాగపట్టినమ్ జిల్లా కేంద్రానికి తరలించినట్లు మత్స్య శాఖకు చెందిన జాయింట్ డైరెక్టర్ అమల జేవేరియా తెలిపారు. గత నెలలో కూడా రామేశ్వరానికి చెందిన10 మంది మృత్య కారులను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది.