-
తమిళ జాలర్ల అరెస్ట్
రామేశ్వరం : తమిళనాడుకు చెందిన ఐదుమంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. హిందూమహాసముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్పకారులు.. పొరపాటును శ్రీలంక ప్రాదేశిక జలాల్లోని నెడుంతీవు ప్రాంతానికి వెళ్లడంతో అదుపులోకి తీసుకున్నట్లు లంక నేవీ అధికారలు ప్రకటించారు. అంతేకాక జాలర్లకు చెందిన పడవలను సీజ్ చేసినట్లు మణికండన్ అనే అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. కచ్చాతీవులో చేపల వేటకు వెళ్లిన తమిళ జాలర్లను లంక నేవీ అధికారులు వెంటాడినట్లు రామేశ్వరం జాలర్ల సంఘం అధ్యక్షుడు ఎమ్రీత్ చెప్పారు. లంక నేవీ అధికారులు వెంటాడడంతో 50 మంది జాలర్లు.. వేగంగా వెనక్కు వచ్చినట్లు ఆయన చెప్పారు. నెడుంతీవు తీరంలో చేవల వేటకు వెళ్లిన పదిమంది జాలర్లను ఈ నెల 8న లంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు. వీరిని విడుదల చేయించేందుకు తమిళనాడు, భారత ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
శ్రీలంక అదుపులో భారత జాలర్లు
కొలంబో: తమ ప్రాదేశిక జాలాల్లోకి ప్రవేశించారనే నెపంతో నలుగురు మత్య్సకారులను శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శ్రీలంక నేవి లెఫ్టినెంట్ కమాండర్ చమిందా మీడియాకు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నామని వారి వద్ద నుంచి బోటుతో పాటు పలు సామన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. -
10 మంది భారత జాలర్ల అరెస్ట్
కొలంబో: శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 10 మంది భారత జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. సముద్రంలో జాలర్లు ప్రయాణించడానికి ఉపయోగించిన ఓ బోటును కూడా స్వాధీనం చేసుకున్నారు. జాలర్లు అక్రమంగా మా జలాల్లోకి ప్రవేశించడం ఆపకపోతే అరెస్ట్లు కొనసాగుతాయని శ్రీలంక మత్స్యకార మంత్రి మహీంద్ర అమరవీర ప్రకటించారు. సముద్రజలాల వివాదంపై వచ్చేనెలలో సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు. గత నెలలో శ్రీలంక నేవీ జరిపిన కాల్పుల్లో తమిళనాడుకు చెందిన ఓ జాలరి చనిపోయిన సంగతి తెల్సిందే. -
శ్రీలంక అదుపులో భారత జాలర్లు
రామేశ్వరం: తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో శ్రీలంక నేవి సిబ్బంది 13 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. మత్స్యకారులకు చెందిన రెండు బోట్లను సీజ్ చేయడంతో పాటు చేపల వేటకు వినియోగించే 20 వలలను ధ్వంసం చేశారు. రామేశ్వర తీరంలోని వాడమరచి వద్ద శ్రీలంక ప్రదేశిక జలాల్లో చేపలు పడుతున్న నలుగురు మత్స్యకారులతో పాటు, అక్కరాయిపెట్టాయి వద్ద తొమ్మిది మందిని అరెస్ట్ చేసి నాగపట్టినమ్ జిల్లా కేంద్రానికి తరలించినట్లు మత్స్య శాఖకు చెందిన జాయింట్ డైరెక్టర్ అమల జేవేరియా తెలిపారు. గత నెలలో కూడా రామేశ్వరానికి చెందిన10 మంది మృత్య కారులను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది. -
ఎనిమిది మంది మత్స్యకారులు అరెస్ట్
రామేశ్వరం : ఎనిమిది మంది భారత మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నావిక దళం గురువారం వెల్లడించింది. మత్స్యకారులకు చెందిన రెండు బోట్లను కూడా సీజ్ చేసినట్లు ప్రకటించింది. శ్రీలంక సముద్ర ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో వారిని కంగేసన్తురాయి ఓడరేవు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. అరెస్ట్ చేసిన వారంతా తమిళనాడుకు చెందిన మత్య్సకారులను పేర్కొంది. శ్రీలంక నావికాదళ ప్రకటనపై రామేశ్వరంలోని మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఎస్ శేఖర్ స్పందించారు. ఈ వార్త నిజమేనన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement