గుజరాత్లో భూకంపం
అహ్మదాబాద్ : భూకంపంతో గుజరాత్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గురువారం వేకువ ఝామున స్వల్ఫ ప్రకంపనలు సంభవించాయి. రాజ్కోట్ జిల్లా హంజియసర్ ప్రాంతంలో ఉదయం 4గం.3ని. సమయంలో భూమి స్వల్ఫంగా కంపించింది.
రిక్చర్ స్కేల్పై 4.6 తీవ్రత నెలకొంది. ప్రజలంతా భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు.