కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: కరుణానిధి | DMK slams AIADMK govt over law and order situation in Tamil Nadu | Sakshi
Sakshi News home page

కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: కరుణానిధి

Oct 8 2014 12:57 PM | Updated on Sep 2 2017 2:32 PM

కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: కరుణానిధి

కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: కరుణానిధి

ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలైన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అన్నాడీఎంకే పార్టీపై డీఎంకే పార్టీ మండిపడింది

చెన్నై: ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలైన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అన్నాడీఎంకే పార్టీపై డీఎంకే పార్టీ మండిపడింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయని, వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పార్టీ అధినేత కరుణానిధి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో తీర్మానించారు. 
 
అధికారిక అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల దాడులకు నిరసనగా పార్టీ కార్యకర్తలు శాంతియుత ఆందోళనలు నిర్వహించాలని డీఎంకే తీర్మానించింది. జయలలితకు బెంగళూరు కోర్టు బెయిల్ నిరాకరించిన తర్వాత శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా అన్నాడీఎంకే కార్యకర్తలు మెరుపు దాడికి దిగిన తీరును డీఎంకే పార్టీ తప్పుపట్టింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement