14 మంది 'కమలం' కార్యకర్తలకు గాయాలు | 14 BJP supporters injured in road mishap | Sakshi
Sakshi News home page

14 మంది 'కమలం' కార్యకర్తలకు గాయాలు

Nov 28 2014 12:20 PM | Updated on Mar 29 2019 5:32 PM

ఉత్తరప్రదేశ్లో రాయబరేలి జిల్లా పర్థౌలి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు డీవైడర్ను ఢీ కొట్టి... తిరగబడింది.

బరేలి: ఉత్తరప్రదేశ్లో రాయబరేలి జిల్లా పర్థౌలి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు డీవైడర్ను ఢీ కొట్టి... తిరగబడింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా బీజేపీ కార్యకర్తలని పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు మేనకా గాంధీని పిలిబిత్లో కలసి... న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణంలో వస్తుండగా గత రాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement