‘పద్మ’ అవార్డుల కోసం 1200 ప్రతిపాదనలు

1200 proposals for Padma awards - Sakshi

న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో అసాధారణ, ప్రత్యేక ప్రతిభ చూపిన వారికి ఇచ్చే ‘పద్మ’ అవార్డుల కోసం 1,200పైగా ప్రతిపాదనలు అందినట్లు హోంశాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వాటిలో 1,207 ప్రతిపాదనల పరిశీలన పూర్తయిందని ఒక ప్రకటనలో వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 15వ తేదీలోగా నామినేషన్లు, ప్రతిపాదనలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ అవార్డుల్లో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ ఉంటాయి.

కేంద్ర ప్రభుత్వం 1954 గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభావంతులకు ప్రకటిస్తోంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలు, ప్రసిద్ధ సంస్థలు, భారతరత్న, పద్మ విభూషణ్‌ గ్రహీతల నుంచి ఏప్రిల్‌ 25వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో ప్రతిపాదనలను ఆహ్వానించినట్లు వెల్లడించింది. ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో www.padmaawards.gov.in లోనే పంపాలని కోరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top