ఆ నటుడు ఎందుకిలా చేశాడు? | Sidharth Malhotra says sorry I am done on social media | Sakshi
Sakshi News home page

ఆ నటుడు ఎందుకిలా చేశాడు?

Dec 15 2017 11:52 AM | Updated on Oct 22 2018 6:05 PM

Sidharth Malhotra says sorry I am done on social media - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నెటిజన్ల ప్రపంచానికి షాకిచ్చాడు. సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్లు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి వైదొలుగుతున్నట్లు చేసిన పోస్ట్ వైరల్‌ అయింది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లలో తన ప్రొఫైల్ ఫొటోను తొలగించి, బ్లాక్ గా ఉన్న ఫొటోను అప్‌లోడ్ చేశాడు సిద్ధార్థ్. 'సారీ ఐ యామ్ డన్' అంటూ చేసిన ట్వీట్‌కు విశేష స్పందన వస్తోంది. గంటల వ్యవధిలోనే వేల రీట్వీట్లు, లైక్స్ తో నటుడి పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

అసలు సిద్ధార్థ్ ఎందుకిలా చేయడంటూ నెటిజన్లు కామెంట్ల ద్వారా ప్రశ్నిస్తున్నారు. తన లేటెస్ట్ మూవీ ఐజారీ పబ్లిసిటీ కోసం నటుడు ఇలా చేశాడని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నటి అలియా భట్‌తో ప్రేమ, గొడవ అంటూ పలు వదంతులు ప్రచారం కావడాన్ని వ్యతిరేకిస్తూ బ్లాక్ ఫొటో అప్‌లోడ్ చేసి నిరసన వ్యక్తం చేశాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఐజారీ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్‌పాయ్, రకుల్ ప్రీత్ సింగ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ విడుదల కానుందని, ప్రమోషన్ కోసమే సిద్ధార్థ్ తన ఫొటోలకు బదులు బ్లాక్ ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా అప్‌డేట్ చేసి ఉండొచ్చునన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement