
నిర్మాతగా సంపత్ నంది
రచయితగా కెరీర్ మొదలుపెట్టి దర్శకునిగా రాణిస్తున్న యువకుడు సంపత్ నంది. డెరైక్ట్ చేసిన రెండు (ఏమైంది ఈ వేళ, రచ్చ) సినిమాలతోనే అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయిన సంపత్ నంది
రచయితగా కెరీర్ మొదలుపెట్టి దర్శకునిగా రాణిస్తున్న యువకుడు సంపత్ నంది. డెరైక్ట్ చేసిన రెండు (ఏమైంది ఈ వేళ, రచ్చ) సినిమాలతోనే అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయిన సంపత్ నంది త్వరలో పవన్ కల్యాణ్తో ‘గబ్బర్ సింగ్-2’ చేయబోతున్నారు. తన స్నేహితుల కోసం సంపత్ నిర్మాతగా మారారు. నవీన్ గాంధీని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘గాలి పటం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారాయన. ఆది, రాహుల్, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా ఇందులో ముఖ్యతారలు. ఇప్పటికి 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ -‘‘నేను దర్శకత్వం వహించిన ‘ఏమైంది ఈ వేళ’ తరహాలో యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది. నవీన్ గాంధీకి దర్శకునిగా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. త్వరలోనే టైటిల్ లోగో ఆవిష్కరిస్తాం. నా స్నేహితులు కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటితో కలిసి ఈ చిత్రాన్ని ఎల్.ఎ.టాకీస్ పతాకంపై నిర్మిస్తున్నా’’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, సప్తగిరి, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యం.ఎస్. కుమార్.