రిస్క్‌ చేస్తున్న ‘రంగస్థలం’ టీం.!

Ram charan Rangasthalam Runtime - Sakshi

మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం. క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్‌ చరణ్‌ తొలిసారిగా పల్లెటూరి యువకుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా 1985 నాటి కథతో పీరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత నిడివితో సినిమా అంటే రిస్క్‌ అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆడియన్స్‌ లెంగ్తీ సినిమాలను చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్‌ చూపించటం లేదు. మరి రంగస్థలం టీం ఈ విషయంలో మరోసారి ఆలోచిస్తుందో లేక.. అంత డ్యూరేషన్‌తోనూ సక్సెస్‌ సాధిస్తుందో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top