నాని కృష్ణార్జున యుద్ధంకు సెన్సార్‌ పూర్తి

Nani New Movie Krishnarjuna Yuddham Got UA Certification - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన ‘కృష్ణార్జున యుద్ధం’  చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికెట్ ల‌భించింది. గురువారం ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం ఈ నెల‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌ కానుంది.  వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్న్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని ద్విపాత్రాభిన‌యం చేస్తుండగా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ య్యూటూబ్‌లో మంచి వ్యూస్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.  హిప్‌ హాప్‌ తమిళ సంగీతం సమకూర్చాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top