పూజకు వేళాయె!
కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో విలన్లను రప్ఫాడించిన అజయ్ కృష్ణ తర్వాత గుడిలో పూజలు చేయనున్నారు. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు మహేశ్బాబు. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది.
అక్కడ వేసిన కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్లో ఇంట్రవెల్ బ్యాక్డ్రాప్ ఫైట్తో పాటు, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీక రించారని తెలిసింది. ఈ షెడ్యూల్కి మంగళవారంతో ప్యాకప్ చెప్పారు. నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం అవుతుంది. దేవాలయం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను ప్లాన్ చేశారని సమాచారం. రాజేంద్రప్రసాద్, విజయశాంతి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.