తైవాన్‌లో రైలు ప్రమాదం.. 22 మంది మృతి | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 21 2018 8:00 PM

Taiwan Train Derailed 17 Dead - Sakshi

ఇలాన్‌ (తైవాన్‌) : తైవాన్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. తైతుంగ్‌ నగరానికి వెళ్తున్న పుయ్‌మా ఎక్స్‌ప్రెస్‌ ఇలాన్‌ కౌంటీలోని జిన్మా స్టేషన్‌ వద్దకు రాగానే పట్టాలు తప్పింది. దీంతో రైలులోని 8 బోగీలు పట్టాలు తప్పగా, ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మరణించగా, 132 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. 

Advertisement
Advertisement