భారత్‌లో సగం సమయం యాప్స్‌కే! | Indian phone users spend 47% time on messaging apps | Sakshi
Sakshi News home page

భారత్‌లో సగం సమయం యాప్స్‌కే!

Jun 29 2015 2:14 AM | Updated on Apr 6 2019 9:01 PM

భారత్‌లో సగం సమయం యాప్స్‌కే! - Sakshi

భారత్‌లో సగం సమయం యాప్స్‌కే!

భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్‌ను ఉపయోగించిన సమయంలో సగం సమయాన్ని యాప్స్(అప్లికేషన్స్)కే కేటాయిస్తున్నారట.

న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్‌ను ఉపయోగించిన సమయంలో సగం సమయాన్ని యాప్స్(అప్లికేషన్స్)కే కేటాయిస్తున్నారట. ఫోన్‌ను వాడుతున్నప్పుడు 47 శాతం సమయం వాట్స్‌యాప్, వీ చాట్, హైక్, స్కైప్ వంటి కమ్యూనికేషన్ యాప్స్‌పైనే గడుపుతున్నారట. స్వీడిష్ టెలికం కంపెనీ ‘ఎరిక్‌సన్’ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో 7,500 మందితో పాటు జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికాలోని ఆండ్రాయిడ్ వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు.

స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న భారతీయులు ఎక్కువగా వాయిస్, ఇన్‌స్టంట్ మెసేజింగ్, వాయిస్ ఓవర్ ఇంటర్‌నెట్ ప్రొటోకాల్(స్కైప్ వంటివి), ఈ-మెయిల్స్, సోషల్ నెట్‌వర్కింగ్(ఫేస్‌బుక్ వంటివి)పైనే దృష్టి పెడుతున్నారని ఈ సర్వేలో తేలింది. అదేవిధంగా కమ్యూనికేషన్ యాప్స్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచేందుకు గాను మొబైల్ బ్రాండ్‌బ్యాండ్ వినియోగం మీద యూజర్లు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అమెరికా, బ్రిటన్, భారత్ లలో కలిపి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 30 శాతం సమయాన్ని కమ్యూనికేషన్ యాప్స్‌పైనే కేటాయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement