ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. నాటో దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు మరణించారు.
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. నాటో దళాలే లక్ష్యంగా వారి కన్వాయ్ లోకి పేలుడు పదార్థాలతో నింపిన టొయోటా ఇన్నోవాతో దూసుకెళ్లిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ ఘటనలో పలువురు విదేశీయులు గాయపడినట్లు తెలిసింది.
భారీగా ప్రాణనష్టం కూడా జరిగి ఉంటుందనే వార్తలు వెలువడుతున్నప్పటికీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని కాబూల్ పోలీసు శాఖ అధికార ప్రతినిధి ఇబాదుల్లా కరీమీ అన్నారు. ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నామన్నారు. యుద్ధం జరిగిన పన్నెండేళ్ల తరువాత ఆఫ్ఘన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి తిరిగివెళుతున్న నేపథ్యంలో వారిపై ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఆ క్రమంలోనే ఆదివారం నాటి దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.