ఆ విగ్రహాలు ఆంధ్రులవి కావు....తెలుగువారివి | Sankarrao condemns nayani narsimha reddy's remarks against Tank bund statues demoltion | Sakshi
Sakshi News home page

ఆ విగ్రహాలు ఆంధ్రులవి కావు....తెలుగువారివి

Sep 1 2014 1:14 PM | Updated on Oct 20 2018 5:03 PM

ఆ విగ్రహాలు ఆంధ్రులవి కావు....తెలుగువారివి - Sakshi

ఆ విగ్రహాలు ఆంధ్రులవి కావు....తెలుగువారివి

ట్యాంక్బండ్పై ఉన్న విగ్రహాలు తెలుగువారివే కానీ...ఆంధ్రులవి కావని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు అన్నారు.

హైదరాబాద్ : ట్యాంక్బండ్పై ఉన్న విగ్రహాలు తెలుగువారివే కానీ...ఆంధ్రులవి కావని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కొందరు విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలుగువారి గౌరవానికి నిదర్శనంగా ఎన్టీఆర్ ....మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు.

 

ట్యాంక్బండ్పై ఉన్న ఆంధ్రవారి విగ్రహాలను తొలగిస్తామన్న తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలను శంకర్రావు ఖండించారు. కాగా ట్యాంక్బండ్పై ఉన్న అనవసర ఆంధ్రావాళ్ల విగ్రహాలను తొలగించి, వాటి స్థానంలో నూతన విగ్రహాలకు ప్రతిష్టిస్తామని నాయిని నిన్న సికింద్రాబాద్లోని వీర శైవ లింగాయత్ లింగబలిజ సమావేశంలో  వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement