అభ్యర్థి పేరుపై ఆదివారం నిర్ణయం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిందని, ఈ పేరును ప్రకటిం చాలా వద్దా అనే దానిపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో తమతో కలసి వచ్చే పార్టీలతో పనిచేస్తామన్నారు. స్థానిక కార్యకర్తల అభిప్రాయాల మేరకు సెలక్ట్ అండ్ ఎలక్ట్ విధానంలో భాగంగా ఈ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నాలుగైదు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని, సెటిలర్లు, ముస్లింలు అధికంగా ఉన్న డివిజన్లలో వారికే పోటీచేసే అవకాశం కల్పిస్తామన్నారు.
జీహేచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికే టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలను గుప్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. ఉద్యోగ ప్రకటనలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరుగుతుండటంతో ముస్లింలకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని టీఆర్ఎస్ అమలు చేయలేదని, ఈ విషయంలో టీఆర్ఎస్ను ఎంఐఎం ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్లో పార్టీ నాయకులు భట్టి విక్రమార్క, నాగయ్య, వినోద్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వ ఆస్తులపై ఎన్నికల, రాజకీయ ప్రచారం నిర్వహించవద్దని ఎన్నికల సంఘం నిబంధనలున్నా వాటిని టీఆర్ఎస్ ఉల్లంఘిస్తోందన్నారు. ఈ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గాంధీభవన్లో జీహెచ్ఎంసీ ఎన్నికల పరిశీలకులు, డివిజన్ కమిటీ నాయకుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 4న గాంధీభవన్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేస్తామని.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 5న నగరంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, డివిజన్, బూత్ కమిటీల సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. 6న బూత్కమిటీలతో డివిజన్స్థాయి సమావేశాలు, 7న ఇంటింటి ప్రచారం ద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు.
కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఖరారు
Published Sat, Jan 2 2016 1:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement