-
అందరినీ కూడగట్టి కొట్లాడదాం
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఉద్యమానికి టీఆర్ఎస్ చొరవ చూపుతుందని కేసీఆర్ ప్రకటించారు. బీజేపీపై పోరులో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్ వేదికగా డిసెంబర్ రెండోవారంలో సమరశంఖం పూరించనున్నట్లు తెలిపారు. ‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయదు. కొత్త వ్యవసాయ బిల్లుల ద్వారా రైతాంగానికి, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నది. మతవిద్వేషాలను రెచ్చగొట్టి... ప్రజలను విభజిస్తూ, భావోద్వేగాలతో రాజకీయ లబ్దిపొందుతోంది. దేశానికి నష్టం చేసే ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన కాంగ్రెస్ చతికిలపడింది. బడేభాయ్ వెంటే చోటేభాయ్ అన్నట్లు కాంగ్రెస్, బీజేపీలు రెండూ దేశానికి సరైన మార్గం చూపడంలో విఫలమయ్యాయి. దేశం మీద, ప్రజల మీద ఉన్న బాధ్యతతో టిఆర్ఎస్ చొరవ చూపుతుంది. బీజేపీ విధానాలపై పోరాటానికి దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కతాటిపై నిలిపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది’అని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సంయుక్త సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని వివరించడంతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు, దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని వివరించారు. ‘ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీం విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే నేత స్టాలిన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ప్రకాశ్సింగ్ బాదల్, కుమారస్వామి, సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడాను. బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడే విషయంలో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఈ నాయకులందరితో డిసెంబర్ రెండోవారంలో హైదరాబాద్ నగరంలో సదస్సు నిర్వహించబోతున్నాం. అందులో దేశవ్యాప్త ఉద్యమం గురించి చర్చిస్తాం. దేశానికి ఓ దిశ, దశ నిర్ణయించే విషయంపై మాట్లాడతాం. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల నష్టపోతున్న రైతులు, కార్మికులు, పేదల పక్షాన నిలుస్తాం’అని కేసీఆర్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంలో దిట్ట మోదీ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో తప్పుడు విధానాలు, ప్రచారాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందన్నారు. కాంగ్రెస్ నిష్క్రియాపరత్వ రాజకీయాల నేపథ్యంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇతరపక్షాలపై పడిందన్నారు. ‘దేశ రాజకీయాల్లో ఇప్పుడు భిన్నమైన ట్రెండ్ నడుస్తున్నది. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపుతూ సోషల్ మీడియాను యాంటీ సోషల్ మీడియాగా మార్చింది. ఎన్నికలప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి పాకిస్తాన్, కశ్మీర్, పుల్వామా అంటూ ప్రచారానికి దిగుతున్నది. సరిహద్దుల్లో ఏదో యుద్ధం చేసినట్లు ప్రచారం చేసుకుంటారు. అదే చైనాకు వ్యతిరేకంగా కోట్లాడలేక చతికిలపడతారు. ఏదో చేసినట్లు తప్పుడు ప్రచారం మాత్రం జోరుగా చేసుకుంటారు’అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. బంగారుబాతులను అమ్మేస్తున్నారు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరిట మోదీ సర్కారు వాటిని ప్రైవేటు కార్పోరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తోంది. వాజ్పేయి, మన్మోహన్ హయాంలో ప్రారంభమైన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కొనసాగిస్తూ మోదీ ప్రభుత్వం ఏకంగా 23 ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించింది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది’అని కేసీఆర్ విమర్శించారు. ‘లాభాల్లో నడుస్తూ ప్రజలకు సేవ, ప్రభుత్వాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను మూసి వేస్తున్నారు. రైల్వేస్టేషన్లో ఛాయ్ అమ్మిన అని చెప్పిన మోదీ ఇప్పుడు రైల్వేస్టేషన్లనే తెగనమ్ముతున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి’’అని కేసీఆర్ ప్రశ్నించారు. బంగారుబాతు లాంటి ఎల్ఐసీతో పాటు రైల్వేలు, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్, బీపీసీఎల్ లాంటి నవరత్న కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వాటిని ప్రైవేటు, కార్పోరేట్ సంస్థలకు కేంద్రం అప్పగిస్తోంది. ఈ సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. అవి ప్రైవేటుపరం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. వారికి అండగా నిలవాలని టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందిని తెలిపారు. ‘1980 వరకు భారతదేశం కన్నా తక్కువ జీడీపీ ఉన్న చైనా నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కానీ కేంద్ర ప్రభుత్వ చేతగానితనం వల్ల భారతదేశం వెనక్కిపోతున్నది’అని విమర్శించారు. -
'మొన్న హరీష్.. ఇప్పుడు కేటీఆర్ను ఓడిస్తాం'
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో.. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీని 23 మంది పార్టీ ముఖ్యులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ఏర్పాటుచేశారు. అనంతరం ఆయన అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించి విస్తృత ప్రచారం చేయాలని, సోమవారం నుంచే రంగంలోకి దిగాలని నిర్ణయించారు. ఇంకా మీడియా, పబ్లిసిటీ, కార్యక్రమాల కోఆర్డినేషన్ తదితర పది రకాల కమిటీలను ఏర్పాటుచేశారు. మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు: లక్ష్మణ్ గ్రేటర్ ఎన్నికలు రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తును నిర్ణయించేవని, అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నట్టు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. మేనేజ్మెంట్ కమిటీ సమావేశం అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ప్రజలను పట్టించుకోవట్లేదని, గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారన్నారు. గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి 450 ఇళ్లు కట్టించారన్నారు. అంతకంటే ఎక్కువగా నిర్మిస్తే ఏ సవాల్కైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ‘అప్పుడు హరీశ్.. ఇప్పుడు కేటీఆర్’ బీజేపీ ఐటీ సెల్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సోషల్ మీడియా విభాగాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్య క్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ దుబ్బాక లో హరీశ్రావును ఎదుర్కొన్నామని, ఇపుడు కేటీఆర్ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఇదే.. బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, కన్వీనర్గా జాతీయ పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మ ణ్, జాయింట్ కన్వీనర్లుగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్రావు, చింతల రాంచంద్రారెడ్డిని నియమించారు. సభ్యులుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పి.ము రళీధర్రావు, రాజాసింగ్, ఎన్.రాంచంద ర్రావు, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మో త్కుపల్లి నర్సింహులు, డి.రవీంద్రనాయక్, పొంగులేటి సుధాకర్రెడ్డి, కె.రాములు, రాపో లు ఆనందభాస్కర్, ఎం.రఘునందన్రావు, జి.ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్కుమార్, బంగారు శృతిని నియమించారు. -
సర్వశక్తులూ ఒడ్డాల్సిందే!
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ భారీ విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డడానికి సిద్ధపడుతోంది. ఈ మేరకు ఈ నెల 12న రాష్ట్ర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యూహం ఖరారు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావుకు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యత అప్పగించారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, అన్ని స్థాయిల్లో పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయ బాధ్యతలను కేటీఆర్ నిర్వర్తిస్తారు. నోటిఫికేషన్కు, ఎన్నికల తేదీకి నడుమ ఎక్కువ వ్యవధి ఇవ్వకుండా వేగంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే చాన్స్ ఉండటంతో గ్రేటర్ ఎన్నికల్లో మెరుపు వేగంతో కదలాలని టీఆర్ఎస్ భావిస్తోంది. హైదరాబాద్కు గులాబీ దండు జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు పార్టీపరంగా ఇన్చార్జిల నియామకంపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఇన్చార్జిల జాబితాపై స్పష్టత రాగా... ఒకటి రెండు రోజుల్లో ఏయే డివిజన్లో ఎవరు పనిచేస్తారనే అంశంపై స్పష్టత రానుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసే సత్తా ఉన్న ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు ఒకరిద్దరు కార్పొరేషన్ ఛైర్మన్ల్లకు డివిజన్ ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తారు. మంత్రులు కూడా కేవలం ఒక్కో డివిజన్కు మాత్రమే ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వంటి జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ రాష్ట్ర యంత్రాంగమంతా జీహెచ్ఎంసీలో మకాం వేసి ప్రచారం నిర్వహిస్తారు. ఇప్పటికే మూడు విడతలుగా సర్వే జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే మూడు విడతలుగా పార్టీ పరిస్థితి, కార్పొరేటర్ల పనితీరు... తదితరాలపై టీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. గతంలోనే నియోజకవర్గాల వారీగా నియమితులైన పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈ సర్వేలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఈ నివేదికల ఆధారంగా ఇప్పటికే పార్టీ పరిస్థితిపై డివిజన్ల వారీగా పార్టీ అధినేత ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. పనితీరు సరిగా లేని కార్పొరేటర్లను పక్కన పెట్టి అవసరమైతే కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. విపక్షంలో బలమైన నాయకులు ఎవరైనా ఉంటే వారిని పార్టీలోకి రప్పించడంపైనా దృష్టి పెట్టాలని భావిస్తోంది. సుమారు 15 మంది పార్టీ కార్పొరేటర్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని గతంలోనే కేటీఆర్ వెల్లడించిన నేపథ్యంలో చాలా చోట్ల ఔత్సాహికుల నుంచి టికెట్ల కోసం ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. ఇన్చార్జిల నుంచి మరోమారు నివేదికలు తీసుకుని, షెడ్యూలు వెలువడిన తర్వాత సీఎం, కేటీఆర్ వారితో మరోమారు సమావేశమవుతారు. -
జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు ఆమోదం
-
గ్రేటర్లో బ్యాలెట్టే
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో జీహెచ్ఎంసీ సహా ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థలకు బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు అందుబాటులో ఉన్న సమయం, వివిధ అంశాలపై రాజకీయ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఇతరత్రా విషయాలపై సవివరంగా చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిం చింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ బాక్స్లు, పత్రాలు లేదా ఈవీఎంలతో నిర్వహించాలన్న దానిపై రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలు, ఎస్ఈసీ వద్ద రిజిస్టర్ అయి రిజర్వ్ సింబల్స్ పొందిన 39 రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరినట్లు ఎస్ఈసీ తెలిపింది. దీనిపై స్పందించిన 8 గుర్తింపు పొందిన పార్టీల్లో ఐదు బ్యాలెట్ బాక్స్ వైపే మొగ్గుచూపగా ఒక పార్టీ ఈవీఎం ద్వారా ఎన్నికలకు మొగ్గుచూపింది. అలాగే 18 రిజిస్టర్డ్ పార్టీల్లో 11 బ్యాలెట్ బాక్స్ల ద్వారానే ఎన్నికలు జరపాలని కోరగా, రెండు పార్టీలు ఈవీఎంల వైపు మొగ్గుచూపాయని తెలి పింది. మిగతా 7 పార్టీలు ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని ఎస్ఈసీ పేర్కొంది. బ్యాలెట్తో పోల్చితే ఈవీఎంలతో ఎన్నికల వల్ల కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. అందుబాటులో లేని వీవీప్యాట్లు... ఈవీఎంలకు వీవీప్యాట్ మెషీన్లను అనుసంధానించాలన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో తమ వద్ద వీవీప్యాట్లు అందుబాటులో లేకపోవడంతో వాటి కోసం హైదరాబాద్ ఈసీఐఎల్, బెంగళూరు బీఈఎల్ల నుంచి కొటేషన్లు కోరామని ఎస్ఈసీ వివరించింది. అయితే దీనిపై వీవీప్యాట్ల తయారీకి ఢిల్లీలోని ఈసీ అనుమతి కోరుతూ ఆయా సంస్థలు లేఖలు రాశాయని, ఈసీ నుంచి ఇంకా జవాబు రావాల్సి ఉందని తెలిపింది. వీవీప్యాట్లు అందుబాటులో లేని కారణంగానే 2019లో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, 2020 మొదట్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ బాక్స్లతో నిర్వహించిన విషయాన్ని ఎస్ఈసీ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈవీఎం, వీవీప్యాట్లతో హైరిస్క్ వల్లే.. ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ల వినియోగానికి ముందు వివిధ ప్రక్రియలు పూర్తిచేయాల్సి ఉందని, అన్ని దశల్లోనూ తయారీదారుల పక్షాన పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది ప్రమేయం ఉంటుందని ఎస్ఈసీ పేర్కొంది. అంతేకాకుండా మూసి ఉంచిన గదుల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను శుభ్రం చేయడం, కట్టి ఉంచిన మిషన్లను తెరవడం, మళ్లీ ప్యాక్ చేయడం వంటి పనుల్లో భారీగా సిబ్బందిని నియమించాల్సి వస్తుందని తెలియజేసింది. ఈ విధంగా ‘హైరిస్క్ కమ్యూనిటీ’గా ఉన్న వారిని భాగస్వాములను చేయడం ద్వారా ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తికి అధిక అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. బ్యాలెట్ బాక్స్లు, ఈవీఎంలకు సంబంధించి... 1989లో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పార్లమెంట్ సవరించాక ఎన్నికల్లో ఈవీఎంల వినియోగానికి వీలు ఏర్పడింది. 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని పూర్తిస్థాయిలో వినియోగించారు. ఆ తర్వాత జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించారు. 1995 నుంచి 2019 వరకు జరిగిన అన్ని గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ బాక్స్లతోనే జరిగాయి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు 1995, 2000లో బ్యాలెట్ బాక్స్లతో... 2005, 2014లలో జరిగిన ఎన్నికలను ఎస్ఈసీ ఈవీఎంలతో(వీవీప్యాట్లు లేకుండా) నిర్వహించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మొదటి సాధారణ ఎన్నికలను 2002లో బ్యాలెట్ బాక్స్లతో, 2009, 2016 ఎన్నికలు ఈవీఎంలతో(వీవీప్యాట్లు లేకుండా) జరిగాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement