‘పది’లో 10/10 | 10/10 in tenth | Sakshi
Sakshi News home page

‘పది’లో 10/10

May 12 2016 2:52 AM | Updated on Apr 4 2019 4:44 PM

‘పది’లో 10/10 - Sakshi

‘పది’లో 10/10

దిల్‌సుఖ్‌నగర్ లోటస్‌లాప్ పాఠశాలలో చదివే కవల బాలికలు బుధవారం విడుదల చేసిన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 10/10 గ్రేడ్ మార్కులు సాధించారు.

సాధించిన కవలలు

 సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ లోటస్‌లాప్ పాఠశాలలో చదివే కవల బాలికలు బుధవారం విడుదల చేసిన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 10/10 గ్రేడ్ మార్కులు సాధించారు. శాంతినగర్‌లో నివసించే సామాజిక కార్యకర్త పూజారి శ్రీనివాస్, కిరణ్‌జ్యోతి దంపతులకు కవల పిల్లలైన సాత్విక, సంహితలు పది పరీక్ష ఫలితాల్లో ఇద్దరు 10/10 మార్కులు సాధించి ఎవరూ తక్కువ కాదు అని నిరూపించుకున్నారు.

ఈ మేరకు స్కూల్ కరస్పాండెంట్ కె.గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపల్ వారికి అభినందనలు తెలిపారు. ఇద్దరు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నట్లు తండ్రి శ్రీనివాసులు ‘సాక్షి’కి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement