'తండ్రీకొడుకులు జైలుకెళ్లడం ఖాయం' | ysrcp MLA ravindranath reddy | Sakshi
Sakshi News home page

'తండ్రీకొడుకులు జైలుకెళ్లడం ఖాయం'

Oct 17 2015 11:42 AM | Updated on Jul 28 2018 3:30 PM

'తండ్రీకొడుకులు జైలుకెళ్లడం ఖాయం' - Sakshi

'తండ్రీకొడుకులు జైలుకెళ్లడం ఖాయం'

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మిస్తున్నది ఏపీ రాజధాని కాదని, అదొక మాయాబజార్ అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఎద్దేవా చేశారు.

కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మిస్తున్నది ఏపీ రాజధాని కాదని, అదొక మాయాబజార్ అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పిలుపుమేరకు కడప కలెక్టరేట్ వద్ద శనివారం రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి.

ఈ దీక్షలను కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా ప్రారంభించారు. దీక్షా శిబిరాన్నిసందర్శించిన రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో రూ.1.50 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని, భవిష్యత్తులో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు.



 

Advertisement
 
Advertisement
Advertisement