'తండ్రీకొడుకులు జైలుకెళ్లడం ఖాయం' | ysrcp MLA ravindranath reddy | Sakshi
Sakshi News home page

'తండ్రీకొడుకులు జైలుకెళ్లడం ఖాయం'

Oct 17 2015 11:42 AM | Updated on Jul 28 2018 3:30 PM

'తండ్రీకొడుకులు జైలుకెళ్లడం ఖాయం' - Sakshi

'తండ్రీకొడుకులు జైలుకెళ్లడం ఖాయం'

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మిస్తున్నది ఏపీ రాజధాని కాదని, అదొక మాయాబజార్ అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఎద్దేవా చేశారు.

కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మిస్తున్నది ఏపీ రాజధాని కాదని, అదొక మాయాబజార్ అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పిలుపుమేరకు కడప కలెక్టరేట్ వద్ద శనివారం రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి.

ఈ దీక్షలను కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా ప్రారంభించారు. దీక్షా శిబిరాన్నిసందర్శించిన రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో రూ.1.50 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని, భవిష్యత్తులో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement