బ్యూటిప్స్
ముఖారవిందానికి ఎన్నోరకాల ఫేస్ప్యాక్స్ వేసుకుంటుంటారు. పండ్లనీ, కాయలనీ ఇంకా ఏవేవో క్రీములతో ప్యాక్స్ వేసుకోవడం విన్నాం. కానీ ఈ కింది ప్యాక్స్ వాడి చూడండి. జిడ్డుతనం, మొటిమలు, మచ్చలు లాంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందుతారు. జిడ్డు చర్మం కారణంగానే మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. దానికి చక్కటి పరిష్కారం బంతిపూల ప్యాక్. రెండు పెద్ద బంతిపూలను పూర్తిగా తుంచేసి మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్లా చేసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ ఉసిరి పొడి, ఒక టీస్పూన్ పెరుగు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంతో రోజూ ఉదయం ఫేస్ప్యాక్ వేసుకొని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెండు వారాలు చేస్తే జిడ్డుతనం తగ్గి ముఖంలో నిగారింపు వస్తుంది.
చలికాలంలో ముఖంపై పగుళ్లు, గీతలు కనిపిస్తుంటాయి. ఎన్ని మాయిశ్చరైజర్లు రాసుకున్నా అది కొద్దిసేపటికే ఇంకిపోతుంటుంది. రోజంతా ముఖం మృదువుగా ఉండాలంటే చేమంతి ప్యాక్ వేసుకుంటే సరి. అందుకు రెండు చేమంతి పూలను నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ నీటిలో కాస్త తేనె, పాలు పోసి కలుపుకోవాలి. రోజూ ఉదయం బయటికి వెళ్లేటప్పుడు ఈ మిశ్రమంతో ముఖంపై బాగా మర్దన చేసుకొని రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే రోజంతా ముఖం తాజాగా, అందంగా ఉంటుంది.
{yై స్కిన్ వారికి మల్లెలు ఎంతో మేలు చేస్తాయి. వారు 5-6 మల్లెపూలను పేస్ట్లా చేసుకొని, అందులో కొద్దిగా పెరుగు వేసి కలుపుకోవాలి. దాంతో రోజూ ఉదయం లేచిన వెంటనే ముఖానికి ప్యాక్ వేసుకుంటే మంచి రంగుతేలడంతో పాటు పొడితనం కూడా తగ్గుతుంది. సమయం అంతగా కేటాయించలేని వారు మల్లెపూలను ఉడకబెట్టి, ఆ నీళ్లలో ఏదైనా ఫెయిర్నెస్ క్రీం కలిపి ముఖంపై ఓ నిమిషం మర్దన చేసుకొని వెంటనే గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలు కోమలమైన చర్మం మీ సొంతం.
తామరపూలలో లినోనిక్ యాసిడ్తో పాటు అనేక రకాల మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అవి ముఖాన్ని తెల్లగా చేయటమే కాకుండా నల్లమచ్చలను పోగొడ్తాయి కూడా! అందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఒక పెద్ద తామరపువ్వును బాగా కడిగి రేకులను వేరుచేసి నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ నీరు చల్లారాక అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. తర్వాత వాటిని ఓ సీసాలో తీసుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే సరి. రోజూ ముఖం కడుక్కోవడానికి ఆ నీటిని ఉపయోగించుకుంటే సరి!
పూవులాంటి మోముకు...
Published Wed, Oct 14 2015 11:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement