పదోతరగతి విద్యార్థినితో ప్రేమాయణం.. | Young man's murder | Sakshi
Sakshi News home page

పదోతరగతి విద్యార్థినితో ప్రేమాయణం..

Jun 23 2016 2:03 PM | Updated on Aug 29 2018 4:18 PM

ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది.

ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది. అభం శుభం తెలియని చిన్నారిని ప్రేమ పేరుతో వాడుకుంటున్నాడని ఓ యువకుడి పై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా గుండాల మండలం సీతారాంపురంలో గురువారం వెలుగుచూసింది.

వివరాలు.. గ్రామానికి చెందిన వంపు మహేందర్(25) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక(15)ను తన ఆటోలో ప్రతిరోజు మోత్కూరులోని పాఠశాలలో దింపేవాడు. ఈ క్రమంలో ఆ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఈ ఏడాది బాలిక పాఠశాల మారడంతో.. ఆమెతో గొడవ పెట్టుకున్నాడు.

 

ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామం మొత్తం పాకడంతో.. ఈ రోజు గుర్తుతెలియని వ్యక్తులు మహేందర్‌పై గొడ్డళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఇది గుర్తించిన కొందరు అతన్ని భువనగిరి ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement