'వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన బాబు' | y visweswara reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

'వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన బాబు'

Jun 14 2016 1:49 PM | Updated on Jul 28 2018 3:33 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.  మంగళవారం విజయవాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... రూ. 87 వేల కోట్ల రైతు రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు రూ. 7 వేల కోట్లు కూడా విడుదల చేయలేదని విమర్శించారు.

నీటిపారుదల విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్ట్లు నిర్మిస్తున్న చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎడారిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు భయంతోనే రాష్ట్ర ప్రయోజనాలకు చంద్రబాబు తాకట్టు పెట్టారని వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement