ఘనంగా తిరునక్షత్రోత్సవం | special pujas in yadadri | Sakshi
Sakshi News home page

ఘనంగా తిరునక్షత్రోత్సవం

Aug 5 2016 6:14 PM | Updated on Sep 4 2017 7:59 AM

ఘనంగా తిరునక్షత్రోత్సవం

ఘనంగా తిరునక్షత్రోత్సవం

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో శ్రావణ శుద్ధ శుక్రవారం ఆండాళ్‌ అమ్మవారి తిరునక్షత్రోత్సవం (పుట్టినరోజు) సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో శ్రావణ శుద్ధ శుక్రవారం ఆండాళ్‌ అమ్మవారి తిరునక్షత్రోత్సవం (పుట్టినరోజు) సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో సువర్ణ పుష్పార్చన, ప్రత్యేక సుదర్శన నారసింహా యాగం, నారసింహ అష్టోత్తర పూజ, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఇందుకోసం ఆలయంలో పారాయణం చేయడానికి ప్రత్యేకంగా ఐదుగురు ప్రత్యేక  రుత్విక్కులను ఆహ్వానించారు. ఆలయాన్ని, స్వామి అమ్మవార్లను అందంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంరపింతి ప్రత్యేక గజ వాహన సేవలో ఊరేగించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మెన్‌ బి. నరసింహామూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు నల్లంతీగళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు,  కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు సురేంద్రాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, అధికారులు చంద్రశేఖర్, దోర్భల భాస్కరశర్మ,  గోపాల్, వేముల వెంకటేశ్‌ పాల్గొన్నారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement