నయీమ్‌ కేసు సీబీఐకి అప్పగించాలి | NAYEM case handower the cbi | Sakshi
Sakshi News home page

నయీమ్‌ కేసు సీబీఐకి అప్పగించాలి

Aug 17 2016 11:53 PM | Updated on Sep 4 2017 9:41 AM

నయీమ్‌ కేసు సీబీఐకి అప్పగించాలి

నయీమ్‌ కేసు సీబీఐకి అప్పగించాలి

యాదగిరిగుట్ట/వలిగొండ: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత రాజకీయ పార్టీల నాయకులవి, పలు శాఖల అధికారుల చరిత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

యాదగిరిగుట్ట/వలిగొండ: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత రాజకీయ పార్టీల నాయకులవి, పలు శాఖల అధికారుల చరిత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు.  20ఏళ్లలో గ్యాంగ్‌స్టర్‌ సంపాదించిన అక్రమ ఆస్తులను బయటపెట్టాలని, ఆయనకు సహకరించిన ప్రజాప్రతినిధులను, అధికారులను కఠినంగా శిక్షించాలన్నారు. తెలంగాణ, ఆంధ్రపదేశ్‌లోనే కాకుండా మరో ఐదు రాష్ట్రాల్లో ఆయన కార్యకలాపాలు విస్తరించాయని, ఎంతో మంది అమాయక ప్రజల ఆస్తులను లాగేసుకొని రోడ్డుపాలు చేశారన్నారు. జిల్లాలో 99శాతం మంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నయీమ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. నయీమ్‌ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భువనగిరికి చెందిన కౌన్సిలర్లను నయీమ్‌తో బెదిరింపజేసి అధికారపార్టీలో చేర్పించుకున్నారన్నారు. నయీమ్‌ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో లభించిన డైరీలో ఎంతో మంది రాజకీయ నాయకుల చరిత్రలు ఉన్నాయని, వాటిని సీఎం కేసీఆర్‌ బయట పెట్టాలన్నారు. సిట్‌ విచారణ లో వెల్లడైన విషయాలను గోప్యంగా ఉంచి అధికార పార్టీకి చెందిన నాయకులను కేసు నుంచి తప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. నÄæూమ్‌ మెుత్తం ఆస్తులను చూపెట్టకుండా రూ.2.80కోట్లు మాత్రమే చూపెట్టడం విడ్డూరమన్నారు. ఆస్తులను పేదలకు పంచాలని కోరారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జెడ్పీమాజీ చైర్మన్‌ కసిరెడ్డి నారాయణరెడ్డి, బీర్ల అయిలయ్య, తంగళ్లపల్లి రవికుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, సుడుగు శ్రీనివాస్‌రెడ్డి, గుండ్లపల్లి నర్సింహగౌడ్‌ తదితరులున్నారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement