వివాహిత బలవన్మరణం | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

వివాహిత బలవన్మరణం

Oct 23 2016 12:49 AM | Updated on Oct 20 2018 6:19 PM

వివాహిత బలవన్మరణం - Sakshi

వివాహిత బలవన్మరణం

నెల్లూరు (క్రైమ్‌) : పెళ్లయి మూడేళ్లు కావస్తోంది. పచ్చని వారి సంసారంలో అనుమానం పెనుభూతంగా మారింది. భర్త వేరే మహిళతో చాటింగ్‌ చేస్తోన్నాడని, ఆమెతో వివాహతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వివాహిత ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

  •  - భర్తపై అనుమానంతో ఉరేసుకుని.. 
  • నెల్లూరు (క్రైమ్‌) : పెళ్లయి మూడేళ్లు కావస్తోంది. పచ్చని వారి సంసారంలో అనుమానం పెనుభూతంగా మారింది. భర్త వేరే మహిళతో చాటింగ్‌ చేస్తోన్నాడని, ఆమెతో వివాహతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వివాహిత ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కర్నాలవీధిలో శనివారం చోటు చేసుకుంది. పెద్దబజారుకు చెందిన భవాని (32)కి కర్నాలవీధికి చెందిన మట్టుమడుగు వసంతకుమార్‌తో మూడేళ్ల కిందట వివాహమైంది. వారికి ఓ బాబు ఉన్నాడు. వసంతకుమార్‌ కృష్ణపట్నం పోర్టులో సివిల్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా వసంతకుమార్‌ ఇంటికి వచ్చిన తర్వాత భార్యను పట్టించుకోకుండా మహిళలతో వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్‌ చాటింగ్‌ చేస్తున్నాడు. ఈ విషయమై పలు దఫాలు దంపతుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో అతను వేరే మహిళలతో వివాహేతర సంబదం ఏర్పరచుకున్నాడని భవాని అనుమానం పెంచుకుంది. శుక్రవారం రాత్రి  ఈ విషయమై దంపతుల నడుమ ఘర్షణ జరిగింది. అయినా వసంతకుమార్‌ పట్టించుకోలేదు.  శనివారం వసంతకుమార్‌  ఉదయం 9 గంటలకు ఉద్యోగానికి బయలుదేరి వెళ్లాడు. ఆమె అత్త పక్కింటికి వెళ్లింది. ఈ సమయంలో భవాని భర్తకు ఫోన్‌ చేసి పద్ధతి మార్చుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అతను పట్టించుకోకుండా ఫోన్‌ పెట్టేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే భార్య ఏం చేసుకుంటుందోనని భావించిన వసంతకుమార్‌ పెద్దబజారులోని తన బావమరిది జయకృష్ణకు ఫోన్‌ చేసి ఇంటికి వెళ్లి చూడాలని చెప్పాడు. దీంతో జయకృష్ణ  ఇంటికి వెళ్లిచూడగా భవాని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంది. వసంతకుమార్‌ ఇంటికి వచ్చి భార్య మృతదేహం చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. బాధిత కుటుంబ సభ్యులు ఒకటో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌కే అబ్దుల్‌ కరీం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమె మృతదేహానికి తహశీల్దార్‌  శవపంచనామా నిర్వహించారు. మృతురాలి అన్న జయకృష్ణ ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డీఎస్‌ఆర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement