
ఉత్సాహంగా జూడో ఎంపికలు
రాజంపేట ఏఐటీఎస్లో శనివారం జూడో జట్టు ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. పోజేఎన్టీయూ (అనంతపురం) పరిధిలోని వైఎస్సార్జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాల క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొన్నారు.
రాజంపేట:
రాజంపేట ఏఐటీఎస్లో శనివారం జూడో జట్టు ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. పోజేఎన్టీయూ (అనంతపురం) పరిధిలోని వైఎస్సార్జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాల క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొన్నారు. ఈ పోటీల ద్వారా ఎంపికైన పురుష, మహిళ జట్లు నవంబరు మొదటివారంలో హర్యానా రాష్ట్రంలో జరిగే జాతీయ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొననున్నారు. జేఎన్టీయూ క్రీడా కార్యదర్శి జోజిరెడ్డి మాట్లాడుతూ యూనవర్సిటీ స్థాయికి ఎంపికైన విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచి యూనవర్సిటీకి మంచి పేరు తీసుకురావాలన్నారు. జూడో జట్టు ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపల్ నారాయణ, రాష్ట్ర జూడో సెక్రటరీ కె.బాబు, ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పాయల్లారెడ్డి మాట్లాడుతూ నేటి తరం యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ఒలంపిక్స్ పతకం సాధించిన సింధూను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పీడీ నాగముని, వివిధ కళాశాల జూడో పీడీలు పాల్గొన్నారు.
బాలుర జట్టు..
జూడో బాలుర జట్టు: ఎస్.గాదిలింగ, జి.వన్నూరుస్వామి , ఎస్.చాంద్బాషా, బీ.ఉస్మాన్దాదా, పీ.యుగంధర్, పీ.ఆకాష్ , ఎం.హర్షవర్ధన్ , శోబిన్జెకారియా
బాలికల జట్టు..
జూడో బాలికల జట్టు: ఆర్వీ జ్ఞానేశ్వరి. ఎం.నందిని, బీ.బుజ్జి , బీవీఎస్ ప్రణతి, బీ.సుమతి, టీ.సుమలత, కె.మణిదీపిక, ఎ.తనూజ ఎంపికయ్యారు.