కలికిరి జేఎన్‌టీయూలో ర్యాగింగ్‌.. విద్యార్థి ఆత్మహత్య | Jntu Student Died Due To Ragging | Sakshi
Sakshi News home page

కలికిరి జేఎన్‌టీయూలో ర్యాగింగ్‌.. విద్యార్థి ఆత్మహత్య

Aug 29 2024 9:30 PM | Updated on Aug 29 2024 9:39 PM

Jntu Student Died Due To Ragging

కలికిరి జేఎన్‌టీయూలో ర్యాగింగ్‌ కలకలం రేగింది.

సాక్షి అన్నమయ్య జిల్లా: కలికిరి జేఎన్‌టీయూలో ర్యాగింగ్‌ కలకలం రేగింది. కడప జిల్లా, మైదుకూరు మండలం జీవి సత్రానికి చెందిన ప్రవీణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఈ నెల 12న కలికిరి జెన్‌టీయూలో బీటెక్ చదివేందుకు కాలేజీలో జాయిన్ అయ్యాడు. ప్రవీణ్‌ను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో ఈ నెల 26న రాత్రి ఇంటికెళ్లి విషం తాగాడు. ఈ సంఘటనపై తల్లిదండ్రులు మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలికిరి సిఐ.. ప్రిన్సిపల్‌, తోటి విద్యార్థులను విచారించారు. ర్యాగింగ్‌ నిజమని తేలితే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ర్యాగింగ్‌ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత బంధువులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement