
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయంలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం భక్తుల రద్దీ మంగళవారం ఉదయం కూడా కొనసాగుతోంది.
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయంలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం భక్తుల రద్దీ మంగళవారం ఉదయం కూడా కొనసాగుతోంది. 27 కంపార్ట్ మెంట్లలో భారీ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది.