
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి తక్కువగా ఉంది.
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి తక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం బుధవారం ఉదయం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక దర్శనం కోసం వచ్చే భక్తులకు 2 గంటలు పడుతోంది. మంగళవారం శ్రీవారిని 75,277మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.