పెళ్లిలో నగలు చోరీ | Wedding Gold Robbery in Krishna | Sakshi
Sakshi News home page

పెళ్లిలో నగలు చోరీ

Dec 26 2018 1:45 PM | Updated on Dec 26 2018 1:45 PM

Wedding Gold Robbery in Krishna - Sakshi

కృష్ణాజిల్లా, కానూరు (పెనమలూరు) : కానూరులో పెళ్లికి వచ్చిన ఓ మహిళ వద్ద బంగారు ఆభరణాలు చోరీ జరగటంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పెనమలూరు పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం హైదరాబాద్‌కు చెం దిన వి. లక్ష్మీపావని రెండు రోజుల క్రితం కానూరులోని ఓ కల్యాణ మం డపంలో బంధువుల పెళ్లికి వచ్చింది. ఆమె తన విలువైన 150 గ్రాముల ఆభరణాలు హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టింది. కొద్ది సమయం తర్వాత బ్యాగ్‌లో చూసుకోగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా చోరీ జరిగిన బంగారు ఆభరణాల విలువ రూ.5 లక్షలు ఉంటుందని బా«ధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement