ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని ఉలిమెల్ల చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. వీరిని 7వ తరగతి చదువుతున్న రాంచరణ్, 8వ తరగతి చదువుతున్న యశ్వంత్గా గుర్తించారు.