-
ఉత్తరకొరియా యుద్ధానికి సిద్ధమవుతోందా?
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా- యునైటెడ్ స్టేట్స్ సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన జరిగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ కమాండర్లతో మాట్లాడుతూ ఈ విన్యాసాలకు నిజమైన యుద్ధంలా కసరత్తు చేయాలని ఆదేశించారు. ఈ సమయంలో ఒక నూతన యుద్ధ ట్యాంక్ తన మొదటి ప్రదర్శనలో విజయవంతంగా మందుగుండు సామగ్రిని ప్రయోగించింది. తన కమాండర్ల పనితీరుకు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఈ విన్యాసాల వివరాలను వెల్లడించిన ఒక నివేదికలో ‘యుద్ధ పరిస్థితులలో సమర్థవంతంగా పనిచేసే ఈ భారీ యుద్ధ ట్యాంకులు ఒకే సారి లక్ష్యాలపై దాడి చేసి, చిధ్రం చేస్తాయని’ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్తో పాటు రక్షణ మంత్రి కాంగ్ సున్నామ్తో పాటు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. సైనిక విన్యాసాల సందర్భంగా కొరియా మీడియా పలు ఫోటోలను విడుదల చేసింది. ఒక ఫోటోలో కొరియన్ నియంత యుద్ధట్యాంక్ను పరీక్షించడాన్ని చూడవచ్చు. కిమ్ స్వయంగా ట్యాంక్ను నడిపినట్లు మీడియా పేర్కొంది. మరొక ఫోటోలో కిమ్ లెదర్ జాకెట్ ధరించగా, కమాండర్లు అతని చుట్టూ ఉన్నట్లు కనిపించారు. ఉత్తర కొరియా జెండా కలిగిన యుద్ధ ట్యాంకులు కూడా ఫొటోలలో కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసం ముగియనున్న తరుణంలో ఈ కసరత్తు కనిపించింది. నవంబర్లో ప్యోంగ్యాంగ్ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో 2018 అంతర్-కొరియా సైనిక ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలకు ఫ్రీడమ్ షీల్డ్ ఎక్స్ర్సైజ్’ అని పేరు పెట్టారు. లైవ్ ఫైర్ డ్రిల్లో పలు యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, ఎఫ్ఏ-50 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి. -
దృశ్యం సినిమా రేంజ్లో హత్య..చివరకు..
ఓ వ్యక్తి తెలివిగా ప్రియురాలిని దృశ్యం మూవీ రేంజ్లో హతమార్చాడు. గుట్టుచప్పుడు కాకుండా పనికానిచ్చి దర్జాగా తిరుగుతున్నాడు. కానీ ఆమె ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులకు చిక్కక తప్పలేదు. చివరికి అసలు నిజం బయటపడి కటకటాల పాలయ్యాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ వ్యక్తి ప్రియురాలిని గుట్టు చప్పుడు కాకుండా కడతేర్చాడు. ఆమె మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న తన ఇంటి ట్వాంకులో దాచిపెట్టాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమె కనపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు ఆమె చివరికాల్ డేటా ఆధారంగా అరవింద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ప్రారంభించారు. విచారణలో ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు అరవింద్. ట్యాంకు వద్ద దాచిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని 35 ఏళ్ల రాజ్ కేసర్గా గుర్తించారు పోలీసులు. నిందితుడు అరవింద్ దాదాపు 14 రోజుల క్రితమే కేసర్ను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: బీఆర్ఎస్ మహిళా నేత ఆత్మహత్య.. వివాహ వేడుకలకు హాజరై..) -
మిరాకిల్.. యుద్ధ ట్యాంక్ కింద నలిగినా ప్రాణాలతో బయటపడి..
మాస్కో: సైన్యం మిలిటరీ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ యుద్ధ ట్యాంకర్ సైనికుడి పైనుంచి దూసుకెళ్లింది. 13 టన్నుల బరువున్న వాహనం తనపై నుంచి వెళ్లినా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. చక్రాల కింద నలిగినా మరణాన్ని జయించాడు. ఇంతా జరిగినా యథావిధిగా మళ్లీ లేచి తన స్థానంలో నిల్చున్నాడు. రష్యా సైన్యం మిలిటరీ డ్రైవ్ సమయంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. 🤡Nothing says "Second Greatest Military Force in the World" quite like crushing your own soldiers under the wheels of a 13 tonne APC during a "cool military drive-by" demonstration. pic.twitter.com/xgFeTWYMCA — Captain Black Sea (@CaptainBlackSe1) October 13, 2022 అయితే రష్యా సైన్యం తీరుపై కొందరు నెటిజన్లు మండిపడ్డారు. ప్రపంచంలో శక్తిమైన సైన్యంగా చెప్పుకునే రష్యా ఆర్మీ.. సొంత సైనికుడి మీద నుంచే యుద్ధ ట్యాంకర్ను పోనివ్వడం వారి నైపుణ్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. మరికొందరు మాత్రం రష్యా సైనికుడు ప్రణాలతో బయటపడటం మిరాకిల్లా ఉందని అన్నారు. అతను అదృష్ట జాతకుడని, అందుకే ఇంకా ఆయుషు మిగిలి ఉందని పేర్కొన్నారు. చదవండి: షాకింగ్ ఘటన.. రూ.690 కోట్ల పెయింటింగ్పై.. -
రహదారిపై భారీ ట్యాంకు
దొరవారిసత్రం: దొరవారిసత్రం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం అతిపెద్ద ట్యాంకు ఓ లారీపై వెళ్లడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ లారీ చెన్నై హార్బర్ నుంచి వారం కిందట వంద అడుగుల పొడవున్న ట్యాంకుతో బయలుదేరింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు వెళ్తోంది. మార్గమధ్యంలో దారికడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు తప్పిస్తూ సిబ్బంది నెమ్మదిగా ముందుకు కదలడం కనిపించింది. -
రష్యన్ యుద్ధ ట్యాంకు పై రెపరెపలాడుతున్న ఉక్రెయిన్ జాతీయ జెండా!
ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం నేటితో 12వ రోజుకు చేరుకుంది. రష్యా నిరవధికంగా సాగిస్తున్న పోరులో ఉక్రెయిన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి దాడి చేస్తూనే ఉంది. ఈ దాడిలో వందలాది ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. అంతేగాక ఉక్రెయిన్ కూడా రష్యా దాడిలో చాలా దారుణంగా అతలా కుతలమైపోయింది కూడా. అయినప్పటికీ ఉక్రెయిన్ వాసుల మా దేశాన్ని కాపాడుకుంటాం, దురాక్రమణకు గురవ్వనివ్వం అంటూ ప్రతి దాడులు చేయడం అందర్ని విస్మయానికి గురి చేసింది. ఆఖరికి మహిళలు, చిన్నపిల్లలతో సహా దాడి చేసేందుకు సిద్ధం అంటూ..రష్యా దళాలకు ఎదురు నిలిచి మరీ పోరాడుతున్నారు. అందులో భాగంగానే రష్యన్ యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్లో రహదారుల్లోకి వస్తున్నప్పడు ప్రజలు ఏ మాత్రం భయపడకుండా తమ దేశంలోకి రావద్దంటూ వాటికి అడ్డంగా నిలబడటం వంటివి కూడా చేశారు. అయితే ఇప్పుడోక వ్యక్తి ఉక్రెయిన్ జాతీయ జెండాను పట్టుకుని ఏకంగా రష్య యుద్ధ ట్యాంకు పైకి ఎక్కి ఎగరవేయడమే కాక ఆనందంగా ఆ జెండాను అటు ఇటూ ఊపుతూ ఉన్నాడు. దీంతో అక్కడ ఉన్న మిగతా వాళ్లు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ఒక పక్క రష్యా దళాలు ఉక్రెయిన్లో ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ ఉక్రెయిన్ వాసుల మాత్రం రష్యన్ దళాలు చొరబడకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వీరోచితంగా పోరాడుతుండటం విశేషం. అయితే ఇప్పటి వరకు ఈ యుద్ధంలో దాదాపు 331 మంది ప్రజలు మరణించారని సుమారు 1.4 మిలియన్లకు పైగా ప్రజలు వలసల బాటపట్టారని యూఎన్ మానవహక్కుల కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. A Ukrainian climbed onto a Russian tank and hoisted the Ukrainian flag.#UkraineRussianWar #Ukraine #UkraineUnderAttack #UcraniaRussia #RussianUkrainianWar pic.twitter.com/BFrQKZvLlE — David Muñoz López 🇪🇦🇪🇺🇺🇦 (@dmunlop) March 7, 2022 (చదవండి: వాషింగ్టన్లో జెలెన్స్ స్కీ పేరుతో రహదారి! వైరల్ అవుతున్న ఫోటో)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement